Vaccination: 15-18 ఏళ్ల వారికి కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభం
దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయసు కలిగిన టీనేజీ పిల్లలకు కరోనా టీకాల పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఈ వయసు వారికి వ్యా్క్సినేషన్ కోసం జనవరి 1 నుంచి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయసు కలిగిన టీనేజీ పిల్లలకు కరోనా టీకాల పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఈ వయసు వారికి వ్యాక్సినేషన్ కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. కొవిన్ యాప్ డేటా ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది కౌమారులు టీకా కోసం పేరు నమోదు చేసుకున్నారు. వీరికి నేటి నుంచి డోసుల పంపిణీ చేపట్టారు. ఆధార్ కార్డు లేని పిల్లలు స్టూడెంట్ ఐడీ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.
15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సూచించారు. దీంతో అన్ని రాష్ట్రాలు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నాయి. ముంబయిలో 9 జంబో సెంటర్లు ఏర్పాటు చేశారు. అస్సాంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. టీనేజీ పిల్లలకు టీకా డ్రైవ్ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ టీకా పంపిణీ ప్రారంభమైంది.
ప్రస్తుతం ఈ వయసు వారందరికీ కొవాగ్జిన్ టీకాను మాత్రమే అందించనున్నారు. తొలి డోసు తీసుకున్న 4 వారాల తర్వాత రెండో డోసును వేస్తారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రి వెల్లడించారు. 2007, అంతకంటే ముందు జన్మించినవారు టీకా వేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు.
జనవరి 10 నుంచి ప్రికాషన్ డోసు..
దేశంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ పరిధిని విస్తరిస్తూ కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా అందించనున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు. దీంతో పాటు జనవరి 10 నుంచి ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ప్రికాషన్ డోసును పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రికాషన్ డోసుగా ఏ వ్యాక్సిన్ వేస్తారన్నది మాత్రం కేంద్రం ఇంకా స్పష్టం చేయలేదు. ఇటీవల కేంద్రం ఆమోదించిన కార్బివాక్స్, కొవొవాక్స్లను ముందు జాగ్రత్త డోసుగా పంపిణీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
90% పైగా అర్హులకు తొలి డోసు
ఇక దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ.. ప్రపంచంలోకెల్లా అత్యంత విజయవంతమైన, భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో ఒకటని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. గత ఏడాది జనవరి 16 నుంచి ఇప్పటివరకు దేశంలో అర్హులైనవారిలో 90% మందికి పైగా తొలి డోసు, 65% మందికి రెండు డోసులు అందాయని వెల్లడించింది. భారత్లో వ్యాక్సినేషన్ గురితప్పిందంటూ వచ్చిన కొన్ని వార్తాకథనాలు ఏమాత్రం సరికావని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘వ్యాక్సినేషన్ విషయంలో భారత్ గురి తప్పిందంటూ ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ ఒకటి ఇటీవల కథనాన్ని ప్రచురించింది. అది తప్పుదోవ పట్టించేలా ఉంది’’ అని అందులో పేర్కొంది. ‘‘అభివృద్ధి చెందిన చాలా పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్లో కొవిడ్ టీకా కార్యక్రమం ఎక్కువగా విజయవంతమైంది. తొమ్మిది నెలల కంటే తక్కువ సమయంలోనే 100 కోట్లకు పైగా డోసుల పంపిణీ పూర్తిచేశాం. అర్హులైన పౌరులకు తొలిడోసు అందించడంలో అమెరికా (73.2%), బ్రిటన్ (75.9%), ఫ్రాన్స్ (78.3%), స్పెయిన్ (84.7%)తో పోలిస్తే భారత్దే (90% పైగా) ముందంజ. రెండోడోసు విషయంలోనూ ముందున్నాం.’’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు