ఈ నెలాఖరుకు భారత్‌కు 36వేల టన్నుల ఉల్లి!

దేశంలో ఏర్పడిన ఉల్లి కొరతను అధిగమించేందుకు ఇప్పటి వరకు విదేశాల నుంచి 12,000 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వెల్లడించారు. ఈ మొత్తాన్ని కేవలం కేజీ రూ.49- రూ.51లకే రాష్ట్రాలకు అందిస్తున్నామని చెప్పారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టర్కీ, అఫ్ఘానిస్థాన్‌...

Published : 08 Jan 2020 01:45 IST

దిల్లీ: దేశంలో నెలకొన్న ఉల్లి కొరతను అధిగమించేందుకు ఇప్పటివరకు విదేశాల నుంచి 12,000 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ వెల్లడించారు. ఈ మొత్తాన్ని కేవలం కిలో రూ.49 - రూ.51లకే రాష్ట్రాలకు అందిస్తున్నామని చెప్పారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టర్కీ, అఫ్గనిస్థాన్‌ తదితర దేశాల నుంచి 12000 టన్నుల ఉల్లి దిగుమతి చేసుకున్నామన్నారు.

ఇప్పటికే 1000 టన్నుల ఉల్లిని దిల్లీ, అంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు పంపిణీ చేశామని పాసవాన్‌ అన్నారు. అంతేకాకుండా ఈ నెల చివరికల్లా మరో 36,000 టన్నుల ఉల్లి దేశానికి వచ్చే అవకాశముందని చెప్పారు. అంతా సజావుగా జరిగితే ఉల్లి రేటు మరింత తగ్గే అవకాశముందన్నారు. గత రెండు నెలలుగా దేశంలో చాలా చోట్ల కేజీ ఉల్లి ధర రూ.100లకు పైగా పలుకుతున్న విషయం తెలిసిందే.  గత నెలలో దిల్లీలో కేజీ ఉల్లి ధర రూ.118 ఉంటే ప్రస్తుతం రూ.70లు పలుకుతోంది. ఖరీఫ్‌లో ఉల్లి ఉత్పత్తి 25 శాతం పడిపోవడంతో దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని