కేరళలో కూలిన పుట్‌బాల్‌ స్టేడియం గ్యాలరీ

కేరళలోని పలక్కడ్‌ పుట్‌బాల్‌ స్టేడియంలో ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాలరీ కూలి సుమారు 50 మంది గాయడ్డారు. ఆదివారం రాత్రి స్టేడియంలో నిర్వాహకులు ఛారీటీ పుట్‌బాల్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌కు అతిథులుగా ఇండియన్‌ పుట్‌బాల్‌ లెజెండ్స్‌

Updated : 20 Jan 2020 15:29 IST

పలక్కడ్‌: కేరళలోని పలక్కడ్‌ పుట్‌బాల్‌ స్టేడియంలో ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాలరీ కూలి సుమారు 50 మంది గాయడ్డారు. ఆదివారం రాత్రి స్టేడియంలో నిర్వాహకులు ఛారీటీ పుట్‌బాల్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌కు అతిథులుగా ఇండియన్‌ పుట్‌బాల్‌ లెజెండ్స్‌ విజయన్‌, బైచింగ్‌ భూటియా హాజరయ్యారు. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి ముందే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ ఒక్కసారిగా కూలింది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నుంచి విజయన్‌, బైచింగ్‌ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్రగాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని