భారత్లో కరోనా కేసులు@415
మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్ తీవ్రత భారత్లో రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 415కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తాజాగా ప్రకటించింది.
దిల్లీ: మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్ తీవ్రత భారత్లో నానాటికీ పెరుగుతోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 415కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 17,493 మంది వ్యక్తుల నుంచి 18,383 శాంపిల్స్ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. ఈ వైరస్పై పరిశోధనలు ముమ్మరం చేసిన ఐసీఎంఆర్, ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ రెండవ దశలోనే ఉందని పలుమార్లు స్పష్టం చేసింది. అయితే, ఈ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో కొవిడ్-19 దశపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశీ ప్రయాణ చరిత్ర లేనప్పటికీ కరోనా వైరస్ నిర్ధారణ అవుతుండటం దీనికి బలం చేకురుతోంది. దేశంలో కరోనా వైరస్ దశపై మరికొన్ని రోజుల్లో ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇంతటి కీలక సమయంలో కరోనా వైరస్ను అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ నిర్వహించడంతోపాటు పలు రాష్ట్రాలు ఈనెల 31వరకు లాక్డౌన్లు ప్రకటించాయి. దీంతో దేశంలోని దాదాపు 80ప్రధాన పట్టణాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. మహారాష్ట్రలో తాజాగా ఈ కేసుల సంఖ్య 89కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కరోనా నుంచి కోలుకున్నవ్యక్తి మృతి..
కొవిడ్-19 బారినపడిన 68ఏళ్ల వ్యక్తి కోలుకున్న అనంతరం చనిపోయిన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ఫిలిప్పైన్స్ నుంచి భారత్ వచ్చిన వ్యక్తికి తొలుత కరోనా సోకినట్లు నిర్ధారించారు. కొన్నిరోజుల అనంతరం ఈ వైరస్ నుంచి కోలుకున్నట్లు ప్రకటించగా తాజాగా గత రాత్రి ఆ వ్యక్తి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ముంబయిలో కొవిడ్-19 కారణంగా చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.
అత్యవసర మార్గం ద్వారా పైలెట్ బయటకు..
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ లక్షణాలున్న వారు కూడా ప్రయాణాలు చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు రైళ్లలో ఇలాంటివారు ప్రయాణాలు చేస్తుండగా గుర్తించి వారిని మధ్యలోనే దించివేసిన సంఘటనలు చూశాం. తాజాగా విమానంలో ప్రయాణించి ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడం ఆందోళనకు గురిచేసింది. పుణె నుంచి దిల్లీ బయలుదేరిన ఎయిర్ఏసియా విమానంలో ప్రయణించిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు విమాన సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే ఆ విమానాన్ని దూరంగా నిలిపివేశారు. ఈ సమయంలో పైలట్ అత్యవసర మార్గం ద్వారా బయటకు వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం విచారణ జరిపిన అధికారులు, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే పైలట్ అలా వ్యవహరించారని ఏయిర్ఏసియా పేర్కొంది. అయితే కరోనా లక్షణాలున్న ఆ వ్యక్తిని కూడా మరో ప్రత్యేకమార్గం ద్వారా బయటకు తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆ వ్యక్తికి కొవిడ్-19 నిర్ధారణ కాలేదని వైద్యులు ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మార్చి 20వ తేదీన జరిగినట్లు ఏయిర్ఏసియా వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM