Cop26: భూతాపం నుంచి ద్వీప దేశాలను రక్షించేందుకు ‘ఐరిస్’
వాతావరణ మార్పులను తట్టుకునేలా చిన్న దీవుల దేశాల్లో పటిష్ట మౌలిక వసతులను కల్పించేందుకు భారత్ ప్రతిష్ఠాత్మకంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం...
‘కాప్26’ సదస్సులో ప్రారంభించిన మోదీ
గ్లాస్గో: వాతావరణ మార్పులను తట్టుకునేలా చిన్న దీవుల దేశాల్లో పటిష్ట మౌలిక వసతులను కల్పించేందుకు భారత్ ప్రతిష్ఠాత్మకంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెజీలియంట్ ఐలాండ్ స్టేట్స్’ (ఐరిస్) అనే ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బ్రిటన్లోని గ్లాస్గోలో వాతావరణ సదస్సు (కాప్26) వేదిక వద్ద లాంఛనంగా ప్రారంభించారు. వాతావరణ మార్పులతో పెను ముప్పును ఎదుర్కొంటున్న ఈ దేశాలకు దీని వల్ల మేలు జరుగుతుందని, కొత్త ఆశలను చిగురింపజేస్తుందని ఆకాంక్షించారు. ఆ దేశాలకు ఎంతో కొంత సాయం చేస్తున్నామన్న సంతృప్తిని ఇది మిగిలిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్లు హాజరయ్యారు.
‘‘కొన్ని దశాబ్దాలుగా వాతావరణ మార్పుల ప్రభావం ఎవరినీ విడిచిపెట్టడం లేదు. అభివృద్ధి చెందుతున్న ద్వీప దేశాల (ఎస్ఐడీఎస్)కు అది జీవన్మరణ సమస్యగా మారింది. ఆ ప్రాంతాల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అక్కడ ప్రజల ప్రాణాలకే కాక ఆర్థిక వ్యవస్థలకూ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆ దీవులకు పర్యాటక రంగమే ఆధారం. అయితే విపత్తులకు జడిసి అక్కడికి వెళ్లడానికి పర్యాటకులు వెనుకడుగు వేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కొందరి స్వార్థం వల్ల ప్రకృతికి సంబంధించిన వికృత రూపం తెరపైకి వచ్చింది. దీనివల్ల అభం శుభం తెలియని చిన్న ద్వీప దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి’’ అని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు.
ఇస్రో ద్వారా విపత్తు సమాచారం
‘విపత్తును ఎదుర్కొనే మౌలిక వసతుల కూటమి’ (సీడీఆర్ఐ)ని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. పసిఫిక్ దీవులు, కారికోమ్ దేశాలతో సహకారం కోసం భారత్ ప్రత్యేక ఏర్పాటు చేసిందన్నారు. ఉపగ్రహాల సాయంతో సకాలంలో తుపాను హెచ్చరికలు చేయడానికి, పగడపు దిబ్బలు, తీర ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ వివరాలను ఆయా దేశాలకు అందిస్తామని చెప్పారు. ఐరిస్ను ప్రారంభించిన మోదీని బ్రిటన్ ప్రధాని జాన్సన్ ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తామన్నారు.
భారత వ్యతిరేక శక్తులను కట్టడి చేయాలి
కాప్26 సదస్సు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మధ్య జరిగిన స్వల్పకాల చర్చల్లో.. ఉగ్రవాదంపై పోరు, కొన్ని వేర్పాటువాద సంస్థలు సాగిస్తున్న అతివాద కార్యకలాపాలు సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత వ్యతిరేక వేర్పాటువాద ముఠాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని జాన్సన్ పేర్కొన్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించే అంశంపై ఈ స్వల్ప భేటీలో ప్రత్యేకంగా చర్చ జరగలేదని శ్రింగ్లా తెలిపారు. ఈ అంశంపై ఇరు దేశాల భద్రత సలహాదారులు బుధవారం భేటీ కానున్నట్లు వెల్లడించారు.
ఏమిటీ ఐరిస్?
సీఆర్డీఐలో భాగంగా ఐరిస్ను చేపట్టారు. దీనికింద చిన్న ద్వీప దేశాల్లో వాతావరణ మార్పుల వల్ల క్షేత్ర స్థాయిలో తలెత్తే ముప్పులపై మదింపు వేస్తారు. వీటిని తట్టుకునే మౌలిక వసతుల నిర్మాణం, సామర్థ్య పెంపునకు ఆర్థిక వనరుల సమీకరణకు తోడ్పాటు అందిస్తారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాజెక్టులను చేపడతారు. భారత్, బ్రిటన్, ఆస్ట్రేలియాల మధ్య సహకారం వల్ల ఇది సాధ్యమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Himachal Pradesh: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ ధిక్కరించి క్రాస్ ఓటింగ్కి పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. -
Google: చిన్నప్పటి ఫొటోతో గూగుల్ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు
Google account: చిన్నప్పటి ఫొటోను అప్లోడ్ చేసిన కారణంగా గూగుల్ ఓ వ్యక్తి అకౌంట్ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. -
ECI: బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ‘ఈసీ’ వేటు
ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. -
‘నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు.. అది రాహుల్ పొలిటికల్ స్టంట్’: అశోక్ చవాన్
ఇటీవల కాంగ్రెస్(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం అశోక్ చవాన్ స్పందించారు. -
Satyendar Jain: ఆప్నేత సత్యేందర్ జైన్కు సుప్రీంలో చుక్కెదురు
మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్దే చోరీ.. తర్వాత సీన్ రివర్స్!
ఒంటరిగా ఉన్న వ్యక్తిని అదును చూసి ఇద్దరు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కావడంతో వారి సీన్ రివర్స్ అయింది. -
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే.. ఎస్బీఐకి సుప్రీం డెడ్లైన్
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లను ఈసీకి ఇవ్వకపోవడంతో ఎస్బీఐపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. మార్చి 21లోగా అన్ని వివరాలు ఇవ్వాల్సిందేనని డెడ్లైన్ విధించింది. -
Electoral Bonds: నా విరాళాలు వారికిచ్చాను.. ఎన్నికల బాండ్లపై కిరణ్ మజుందార్ షా
Electoral Bonds: వ్యక్తిగత హోదాలో ఎన్నికల బాండ్ల ద్వారా తాను కొన్ని పార్టీలకు నామమాత్రపు విరాళాలిచ్చినట్లు బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా వెల్లడించారు. -
S Jaishankar: ‘స్నేహమంటే అదే కదా’: నేవీ ఆపరేషన్పై జై శంకర్ ఆసక్తికర రిప్లై
హైజాక్ అయిన నౌక నుంచి 17 మంది బందీలను మన నౌకాదళం విడిపించింది. ఇందుకు బల్గేరియా దేశం ధన్యవాదాలు తెలిపింది. -
Arvind Kejriwal: దిల్లీ జల్బోర్డు కేసులోనూ.. ఈడీ సమన్లకు కేజ్రీవాల్ డుమ్మా
Arvind Kejriwal: దిల్లీ జల్బోర్డుకు సంబంధించిన కేసులోనూ ఈడీ విచారణకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు.ఆ సమన్లు అక్రమమని ఆరోపించారు. -
Russia: మమ్మల్ని విడిపించండి ప్లీజ్: రష్యా నుంచి భారతీయుల మరో వీడియో
Indians Stuck In Russia: రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
Rahul Gandhi: ‘ఆయన మా అమ్మకు ఫోన్ చేసి కన్నీటిపర్యంతమయ్యారు’: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
ఇటీవల కాంగ్రెస్(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎన్డీయే కూటమిపై విమర్శలు చేశారు. -
వారికి అమెరికా పౌరసత్వం ఇస్తుందా?: హరీశ్ సాల్వే
భారత్ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాన్ని సీనియర్ న్యాయవాది, మాజీ సోలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే తప్పుపట్టారు. ప్ -
కోడ్ మీరితే కొరడా!
భారతదేశంలో ఎన్నికలు ఓ మహాసంగ్రామం! గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుంటాయి. -
బెట్టింగ్ యాప్ కుంభకోణం.. భూపేశ్ బఘేల్పై కేసు
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. -
ఆ రూ.4 వేల కోట్ల వివరాలూ వెల్లడించాలి
ఎన్నికల బాండ్లపై మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. 2018 మార్చి 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వరకు అమ్మిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించాలంటూ అందులో పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. -
సీఏఏ నిబంధనల అమలుపై స్టే ఇవ్వండి
పౌరసత్వ (సవరణ) నిబంధనలు-2024 అమలుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. -
మగబిడ్డకు జన్మనిచ్చిన మూసేవాలా తల్లి
దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సిద్ధూ తండ్రి బాల్కౌర్ సింగ్ సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా వెల్లడించారు. -
దిల్లీ జల్బోర్డు కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమన్లు
దేశ రాజధానిలోని నీటి మండలి (జల్బోర్డు)లో అవకతవకలకు సంబంధించి.. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీచేసింది. -
అయిదేళ్ల రోడ్మ్యాప్ సిద్ధం చేయండి!
లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ఘనవిజయం సాధించి వరుసగా మూడోసారి పగ్గాలు చేపడతామన్న భరోసాతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎన్నికల అనంతరం తొలి వంద రోజులకు, ఆ తర్వాత రాబోయే అయిదేళ్ల అభివృద్ధికి కొత్త ప్రభుత్వ రోడ్మ్యాప్ రూపొందించాలని తన మంత్రివర్గ సహచరులను కోరారు. -
హాస్టల్లో నమాజ్ చేస్తున్నారని విదేశీ విద్యార్థులపై దాడి
గుజరాత్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులపై మూక దాడి జరిగింది. వసతి గృహంలో నమాజ్ చేస్తున్నారన్న కారణంతో లోపలకి ప్రవేశించిన దుండగులు, విద్యార్థులపై హింసకు తెగబడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
Himachal Pradesh: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
-
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు
-
Jobs Alert: 5 నోటిఫికేషన్లు.. 25,000+ ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
-
Dell: ఆఫీసుకు రాకపోతే ప్రమోషన్లు ఉండవ్.. ఉద్యోగులకు డెల్ నోటీసు!
-
Ashwin: బెన్స్టోక్స్ వికెట్ మరిచిపోలేను.. ఎల్బీ చేద్దామనుకుంటే బౌల్డయ్యాడు: రవిచంద్రన్ అశ్విన్
-
Google: చిన్నప్పటి ఫొటోతో గూగుల్ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు