పెళ్లాం నగలపై కన్నేస్తే నేరమే..

భార్య నగల చోరీ కేసులో భర్తకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఓ కేసు విచారణ సందర్భంగా.. భార్య నగలను ఆమె వ్యక్తిగత ఆస్తిగా కోర్టు పేర్కొంది.

Updated : 02 Jan 2023 10:31 IST

దిల్లీ: భార్య నగల చోరీ కేసులో భర్తకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఓ కేసు విచారణ సందర్భంగా.. భార్య నగలను ఆమె వ్యక్తిగత ఆస్తిగా కోర్టు పేర్కొంది. భర్త అయినా సరే.. ముందస్తుగా అనుమతి లేకుండా నగలను తీసుకోవడం తప్పేనని స్పష్టం చేసింది. జస్టిస్‌ అమిత్‌ మహాజన్‌ సారథ్యంలోని డివిజన్‌ బెంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో భర్త తన భార్యను అత్తింటి నుంచి వెళ్లగొట్టడం, అపహరించిన నగలను తీసుకువెళ్లడం చేయరాదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న ఈ కేసులో నిందితుడు అధికారులకు సహకరించడం కానీ, అపహరణకు గురైన నగలను తిరిగి స్వాధీనం చేయడం కానీ జరగలేదన్నది తమ దృష్టిలో ఉన్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో భర్తకు ముందస్తు బెయిలు మంజూరు చేసి, పిటిషన్‌ను రద్దు చేయలేమని తెలిపారు. ఈ కేసులో అరెస్టు నివారణకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనరు కోర్టును కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని