కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలుపనున్న కేంద్రం!
ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇద్దరు హైకోర్టు జడ్జీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించేందుకు చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు గురువారం వెల్లడించాయి.
సుప్రీం జడ్జీలుగా అయిదుగురి పేర్లకు లైన్క్లియర్!
దిల్లీ: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇద్దరు హైకోర్టు జడ్జీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించేందుకు చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు గురువారం వెల్లడించాయి. గతేడాది డిసెంబర్ 13న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి ఈ సిఫార్సులు చేసింది. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిత్తల్, పట్నా హైకోర్టు సీజే జస్టిస్ సంజయ్ కరోల్, మణిపుర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్, పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ మిశ్రల పేర్లతో జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈ అయిదుగురి నియామకాలు కార్యరూపం దాల్చితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కు పెరుగుతుంది. సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 మంది జడ్జీల నియామక సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 27 మందే ఉన్నారు. జనవరి 31న సుప్రీంకోర్టు కొలీజియం మరో రెండు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ రాజేశ్ బిందాల్, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ అరవింద్ కుమార్ల పేర్లను దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పదోన్నతులకు సిఫార్సు చేశారు. ఈ రెండు పేర్లను సిఫార్సు చేసే సందర్భంగా అంతకుముందు అయిదుగురి పేర్లతో తాము చేసిన సిఫార్సులకు ప్రాధాన్యం ఉన్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రం దృష్టికి తెచ్చింది.
విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోరా: సుప్రీం
దిల్లీ: విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో తాము స్పష్టంగా గతంలో ఉత్తర్వులు ఇచ్చినా.. పట్టించుకోకపోవడంపై మండిపడింది. ఈ ప్రసంగాలపై పదే పదే మార్గదర్శకాలు జారీ చేయాల్సి రావడం న్యాయస్థానానికి ఇబ్బందికరంగా ఉందని పేర్కొంది. ఈ ఘాటు వ్యాఖ్యలను.. ఈ నెల 5న ‘హిందూ జన్ ఆక్రోశ్ మోర్చా’ ముంబయిలో నిర్వహించనున్న ర్యాలీపై నిషేధం విధించమంటూ దాఖలైన ఓ అత్యవసర పిటిషన్ స్వీకరణ సందర్భంగా గురువారం చేసింది.
వీఆర్ఎస్ ఉద్యోగులను.. వారితో సమానంగా చూడలేం
దిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పొందిన ఉద్యోగులను పూర్తికాలం పాటు పనిచేసి రిటైరయినవారితో సమానంగా చూడలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మహారాష్ట్ర రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎంఎస్ఎఫ్సీ)లో వీఆర్ఎస్ తీసుకున్న కొందరు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రవీంద్ర భట్ల ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్య చేసింది. వేతన స్కేలు సవరణతో కలిగే ప్రయోజనాలను తమకు వర్తింపజేసేందుకు నిరాకరిస్తూ బాంబే హైకోర్టు తీర్పునివ్వడాన్ని సవాలు చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి అపీలుపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పదవీ విరమణ వయసు వచ్చేదాకా పనిచేసినవారితో తమను సమానంగా చూడాలని వీఆర్ఎస్ ఉద్యోగులు కోరడం సమంజసం కాదని స్పష్టం చేసింది.
నెల రోజుల్లోగా బాండ్ సమర్పించలేకపోతే.. బెయిలు షరతులను సవరించండి
దిల్లీ: విచారణలో ఉన్న ఖైదీల్లో చాలామంది బెయిలు మంజూరైనప్పటికీ జైలు నుంచి విడుదల కావడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. బెయిలు షరతులకు అనుగుణంగా బాండ్ సమర్పించలేకపోవడం అందుకు ఓ ప్రధాన కారణమని తెలిపింది. ఈ నేపథ్యంలో- నెల రోజుల్లోగా బాండ్లను సమర్పించలేకపోయిన ఖైదీల కోసం బెయిలు షరతులను సవరించే అవకాశాలను పరిశీలించాలని దిగువ కోర్టులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓకల ధర్మాసనం తాజాగా ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. స్థానిక పూచీకత్తు (లోకల్ ష్యూరిటీ) సమర్పించలేనివారిని.. దానికోసం ఒత్తిడి చేయొద్దని సూచించింది. విడుదలయ్యాక పూచీకత్తు సమర్పిస్తామంటూ ఖైదీలెవరైనా విన్నవిస్తే.. ఆయా కేసులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. బాండు/ష్యూరిటీ సమర్పించేందుకు వీలుగా నిర్దిష్ట కాలం పాటు వారికి తాత్కాలిక బెయిలు మంజూరు చేసే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
జమ్మూ-కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో అయిదుగురు జవాన్లు గాయపడ్డారు. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
మహిళ అపహరణ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. -
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
సందేశ్ఖాలీ ఘటనలు భాజపా ముందస్తు కుట్రేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. -
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి భాజపా చేసే విమర్శలను ఆప్(AAP) తిప్పికొట్టింది. తనవారి కోసమే ఆ పార్టీ పని చేస్తుందని దుయ్యబట్టింది. -
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఏకంగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికారులను షాక్కు గురిచేసింది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
తన కుమారుడు నామినేషన్ వేసిన సందర్భంగా భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) తన బలాన్ని ప్రదర్శించారు. వేల సంఖ్యలో మద్దతుదారులతో భారీ సభను నిర్వహించారు. -
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
Hamida Banu: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా? అందులో కన్పిస్తున్న వ్యక్తి భారత మహిళా రెజ్లర్ హమీదా బాను. ఇంతకీ ఎవరామే? ఏంటామె ప్రత్యేకత? -
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
ముందు రాయ్బరేలీలో గెలువు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన పోస్టుపై గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov) వివరణ ఇచ్చారు. -
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. -
ఛత్తీస్గఢ్లో చెట్టును ఢీకొన్న బీఎస్ఎఫ్ సిబ్బంది బస్సు
ఛత్తీస్గఢ్లో సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ