‘కవచ్’ ఉండి ఉంటే.. కోరమాండల్ ప్రమాదంతో తెరపైకి భద్రతా వ్యవస్థ
ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద కోరమాండల్ ఎక్స్ప్రెస్కు జరిగిన ప్రమాదంతో అందరి దృష్టి ఇప్పుడు ‘కవచ్’పైకి మళ్లింది. రైల్వేలకు సంబంధించిన ఈ ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ అక్కడ లేదని అధికారులు తెలిపారు.
ఈనాడు, దిల్లీ: ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద కోరమాండల్ ఎక్స్ప్రెస్కు జరిగిన ప్రమాదంతో అందరి దృష్టి ఇప్పుడు ‘కవచ్’పైకి మళ్లింది. రైల్వేలకు సంబంధించిన ఈ ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ అక్కడ లేదని అధికారులు తెలిపారు. అది ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏమిటీ కవచ్?
రైళ్లు సురక్షితంగా నడవడానికి ‘కవచ్’ అనే ఈ వ్యవస్థను రైల్వే ఆధ్వర్యంలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్వో) సొంతంగా రూపొందించింది. ఇందులో మూడు భారతీయ సంస్థలూ పాలుపంచుకున్నాయి. ఇందుకు రూ.16.88 కోట్లు ఖర్చయింది.
* ఈ వ్యవస్థలో ఎలక్ట్రానిక్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలు ఉంటాయి. వీటిని రైలు ఇంజిన్లు, పట్టాలు, సిగ్నలింగ్ వ్యవస్థ, ప్రతి స్టేషన్లో ఏర్పాటుచేస్తారు. జీపీఎస్ వ్యవస్థ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ వ్యవస్థ నిరంతరం రైళ్ల కదలికలను గమనిస్తూ సంకేతాలు పంపుతూ ఉంటుంది.
* రెడ్ సిగ్నల్ను పట్టించుకోకుండా లోకో పైలట్ (రైలు డ్రైవర్) రైలును ముందుకు నడిపినప్పుడు (సిగ్నల్ పాస్డ్ ఎట్ డేంజర్- ఎస్పీఏడీ) ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. రైళ్లు పరస్పరం ఢీ కొట్టుకోవడానికి ఇలాంటి హెచ్చరిక లేకపోవడమే ప్రధాన కారణం. అలాంటి సందర్భాల్లో ఈ వ్యవస్థ.. లోకో పైలట్ను అప్రమత్తం చేసి, బ్రేక్లను తన నియంత్రణలోకి తెచ్చుకుంటుంది. అదే లైన్లో మరో రైలు వస్తున్నట్లు గమనిస్తే.. ఆటోమేటిక్గా బ్రేక్లు వేసి ఆపేస్తుంది. ఎదురుగా ఉన్న రైలు నిర్దిష్ట దూరంలో ఉండగానే ఈ పని పూర్తిచేస్తుంది.
* సిగ్నల్ను విస్మరించినప్పుడే కాకుండా పరిమితికి మించి వేగంగా ప్రయాణించకుండా కూడా ఈ వ్యవస్థ చూస్తుంది. అలాంటి సందర్భాల్లో బ్రేక్లు వేసి వేగాన్ని నియంత్రిస్తుంది.
* దట్టమైన పొగమంచు ఆవరించడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో రైలు సాఫీగా, భద్రంగా నడవడానికి సాయపడుతుంది. ఇందుకోసం క్యాబిన్లో సిగ్నల్ను ప్రదర్శిస్తుంది. రైలు వేగంగా వెళ్లడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
* రైలు లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్దకు చేరువవుతున్నప్పుడు ఈ వ్యవస్థ తనంతట తానుగా అప్రమత్తం చేస్తుంది.
* ప్రమాదం జరిగినప్పుడు సమీపంలోని రైళ్లకు అత్యవసర సందేశం పంపి, వాటిని అప్రమత్తం చేస్తుంది.
అందుబాటులో ఉన్నది 2.21% మార్గంలోనే
కవచ్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అది ఇంకా దేశవ్యాప్తం కాలేదు. ప్రస్తుతం దేశంలో 65,114 కిలోమీటర్ల పొడవైన బ్రాడ్గేజ్ మార్గం ఉండగా ఇప్పటివరకూ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 1,465 కిలోమీటర్ల మార్గాన్ని (2.21%) మాత్రమే కవచ్ పరిధిలోకి తీసుకొచ్చారు. మిగతా చోట్ల దాన్ని దశలవారీగా అమలుచేయాలని నిర్ణయించారు.
* దిల్లీ-ముంబయి మార్గంలో 3,000 కిలోమీటర్లు, దిల్లీ-హావ్డా మార్గంలోని 1,165 కిలోమీటర్ల పరిధిలో ‘కవచ్’ ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచారు. తదుపరి గోల్డెన్ క్వాడ్రిలేటరల్, గోల్డెన్ డయాగ్నల్ రూట్లో 6,000 కిలోమీటర్ల మేర కవచ్ ఏర్పాటుకు సర్వే, డీపీఆర్ తయారీ పనులు జరుగుతున్నాయి.
సికింద్రాబాద్ డివిజన్లో స్వయంగా పరీక్షించిన రైల్వే మంత్రి
2022 మార్చి 4న ఈ పరికరాన్ని సికింద్రాబాద్ డివిజన్లోని గుల్లగూడ-చిట్గిడ్డ స్టేషన్ల మధ్య ప్రయోగించి చూశారు. ఇందులో రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్, అప్పటి రైల్వే బోర్డు ఛైర్మన్ వినయ్కుమార్ త్రిపాఠీలు ఎదురెదురుగా వచ్చే రైళ్లలో ప్రయాణించి ప్రత్యక్షంగా దాని పనితీరును పరీక్షించారు.
కవచ్ ఉన్నా కాపాడేది కాదు
వందేభారత్ రూపకర్త సుధాన్షు మణి వ్యాఖ్య
ఇంటర్నెట్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమే కారణమని రైల్వే శాఖ ప్రాథమికంగా భావిస్తోంది. అయితే, రైళ్లు ఎదురెదురుగా ఢీకొట్టడాన్ని నివారించే కవచ్ వ్యవస్థ ఉంటే ఈ ప్రమాదాన్ని నివారించడం సాధ్యమయ్యేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై వందేభారత్ రూపకర్త సుధాన్షు మణి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కవచ్ ఉన్నా ఈ ప్రమాదాన్ని నివారించేది కాదేమో. ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తే... ఇది సిగ్నలింగ్ వైఫల్యంగా కనిపించడం లేదు. తొలి రైలు పట్టాలు తప్పడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మొదటి రైలు ఎలా పట్టాలు తప్పిందనే విషయంపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలి’ అని ఓ జాతీయ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతేకాకుండా అతివేగంతో వెళ్తున్నందున కోరమాండల్ ఎక్స్ప్రెస్ పైలట్ బ్రేకులు వేయలేకపోయారని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM