Cancelled Trains List: ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంతో దక్షిణ, ఆగ్నేయ రైల్వేజోన్లలో 90 రైళ్లను రద్దు చేసి, 46 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
భువనేశ్వర్/ఈనాడు, అమరావతి: ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంతో దక్షిణ, ఆగ్నేయ రైల్వేజోన్లలో 90 రైళ్లను రద్దు చేసి, 46 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. 11 రైళ్ల గమ్య స్థానాలను కుదించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయానికి ఖరగ్పుర్లో ఉన్న చెన్నై సెంట్రల్ - హావ్డా (12480) రైలును జరోలీ మీదుగా పంపించారు. అలాగే వాస్కోడగామా - షాలిమార్ (18048) రైలును కటక్ మీదుగా పంపారు. సికింద్రాబాద్ - షాలిమార్ వీక్లీ (22850) రైలును కటక్ మీదుగా నడుపుతున్నారు. ప్రధాని చేతుల మీదుగా శనివారం జరగాల్సిన గోవా - ముంబై వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవాన్ని కూడా రద్దు చేశారు.
విజయవాడ స్టేషన్లో పడిగాపులు
ఒడిశా రైళ్ల ప్రమాదం నేపథ్యంలో భారీగా సర్వీసులను రద్దు చేయడంతో చెన్నై సహా పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విజయవాడ రైల్వేస్టేషనులో శనివారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. విశాఖ, సికింద్రాబాద్ మధ్యలో నడిచే ఒకటి రెండు రైళ్లు మాత్రమే ఉదయం నుంచి రాకపోకలు సాగించాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు వచ్చిన గోరఖ్పూర్ - కొచ్చువేలి (12511) రైలులో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. చెన్నై వెళ్లే రైలు కావడంతో ప్రయాణికులు బాత్రూమ్లు, తలుపుల వద్ద కూడా కూర్చున్నారు. కొందరు యువకులు కిటికీలను పట్టుకుని వేలాడుతూ ప్రమాదకరంగా వెళ్లారు. విజయవాడ మీదుగా నడిచే 51 రైళ్లు రద్దయ్యాయి. మరో 29 రైళ్లను దారి మళ్లించారు. ఏడు రైళ్లను చేరాల్సిన గమ్యస్థానం కంటే ముందు స్టేషన్లలో ఆపేసి పాక్షికంగా రద్దు చేశారు.
రద్దయిన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇలా..
హావ్డా - బెంగళూర్ (12863), హావ్డా - చెన్నై మెయిల్ (12839), చెన్నై - షాలిమర్ కోరమాండల్ (12842), బెంగళూరు - గువాహటి (12509), హావ్డా - సికింద్రాబాద్ (12703), హావ్డా - బెంగళూరు(12245), షాలిమర్ - హైదరాబాద్ (18045), హావ్డా - తిరుపతి (20889), బెంగళూరు - గువాహటి (12509), చెన్నై సెంట్రల్ - షాలిమర్ (12842), తిరుపతి - హావ్డా (20890), బెంగళూరు - కామాఖ్య (12551), బెంగళూరు - హావ్డా (12864), బెంగళూరు - బగల్పూర్ (12253), హైదరాబాద్ - షాలిమర్ (18046), సికింద్రాబాద్ - హావ్డా (12704), వల్లిపురం - పురులియా (22606), తిరువనంతపురం - షాలిమర్(‘22641).
మళ్లించిన సూపర్ఫాస్ట్ రైళ్లు...
చెన్నై - హావ్డా (12840), వాస్కోడగామా - హావ్డా (18048), సికింద్రాబాద్ - షాలిమర్ (22850), బెంగళూర్ - గువాహటి (12509), తాంబరమ్ - న్యూ తిన్సుకియా (15929), సంతరాగాఛీ - చెన్నై (22807), దిగ - విశాఖపట్నం (22873), హావ్డా - మైసూర్ ఎక్స్ప్రెస్ (22817), సంతరాగాఛీ - చెన్నై (22807), చెన్నై సెంట్రల్ - హావ్డా (22187), చెన్నై సెంట్రల్ - వాస్కోడగామా (12840), వాస్కోడగామా - హావ్డా (18048), సికింద్రాబాద్ - షాలిమర్ (22850), బెంగళూరు - గువాహటి (12509), తాంబరం - న్యూ తిన్సుకియా (15929), సెలిచర్ - త్రివేండ్రం (12508), న్యూజలాయ్గురి - చెన్నై (22612), దిల్బర్గ్ - సికింద్రాబాద్(7047).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!