Bullet Train: ప్రాణనష్టం ఎరుగని బుల్లెట్
జపాన్ అనగానే మనకు గుర్తొచ్చేది బుల్లెట్ రైలు. సురక్షిత ప్రయాణం, సమయపాలనకు అవి పెట్టింది పేరు. శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ వాటిలో ప్రమాదాలకు ఆస్కారం ఉండదు.
జపాన్ షింకాన్సెన్ రైళ్ల తీరు అద్భుతం
శరవేగంగా ప్రయాణం.. ఆపదలకు దూరం
జపాన్ అనగానే మనకు గుర్తొచ్చేది బుల్లెట్ రైలు. సురక్షిత ప్రయాణం, సమయపాలనకు అవి పెట్టింది పేరు. శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ వాటిలో ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. సాంకేతిక వైఫల్యంతో జపాన్లో ఇప్పటివరకూ ఒక్క బుల్లెట్ ట్రైన్ ప్రమాదం కూడా జరగకపోవడం గమనార్హం. ఒడిశాలోని బాలేశ్వర్లో రైలు దుర్ఘటన నేపథ్యంలో జపాన్ బుల్లెట్ రైలు వ్యవస్థ ఎలా నడుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఏమిటీ రైలు?
బుల్లెట్ రైలును జపాన్లో షింకాన్సెన్ అని పిలుస్తారు. షింకాన్సెన్ అంటే జపనీస్ భాషలో ‘కొత్త ట్రంక్లైన్’ అని అర్థం. ఇది నిజానికి హైస్పీడ్ రైలు వ్యవస్థ. 1964 అక్టోబరు 1న.. టోక్యో ఒలింపిక్స్కు 9 రోజుల ముందు ప్రారంభమైంది. తొలుత టోక్యో నుంచి ఒసాకా మధ్య దీని రాకపోకలు సాగాయి. ప్రస్తుతం జపాన్లో షింకాన్సెన్ నెట్వర్క్.. 2,700 కిలోమీటర్లకు విస్తరించింది.
* మొదట్లో ఈ రైలు గరిష్ఠ వేగం గంటకు 210 కిలోమీటర్లుగా ఉండేది. ఆ తర్వాత ఇది ఆధునికతను సంతరించుకుంది. ఫలితంగా దీని వేగం గంటకు 300 కిలోమీటర్లకు పెరిగింది. రోజూ లక్షల మందికి ఇదే ప్రయాణ సాధనం.
* గత 60 ఏళ్లలో ఈ రైళ్లవల్ల ప్రాణనష్టం లేకపోవడం వీటి సమర్థతకు నిదర్శనం. రెండు సందర్భాల్లో ఈ రైళ్లు పట్టాలు తప్పినా.. వాటికి సాంకేతిక వైఫల్యం కారణం కాదు. ఈ ఘటనల్లో మరణాలు చోటుచేసుకోలేదు.
భూకంపాన్ని ముందుగానే పసిగట్టి..
జపాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. షింకాన్సెన్ రూపకర్తలు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. భూకంప మూలస్థానం నుంచి ప్రాథమిక తరంగాలు వెలువడిన వెంటనే ఈ రైల్వే వ్యవస్థ వేగంగా స్పందిస్తుంది. ఆటోమేటిక్గా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుంది. ఆ వెంటనే రైలులోని ‘పవర్ ఫెయిల్యూర్ డిటెక్షన్ సాధనం’ స్పందించి.. రైలుకు అత్యవసర బ్రేక్ వేసి, దాన్ని నిలిపివేస్తుంది. ఇది ప్రయాణికుల ప్రాణాలను, రైలు కీలక మౌలిక వసతులను రక్షిస్తుంది.
అడ్వాన్స్డ్ డ్రైవర్ సపోర్ట్ సిస్టమ్
బుల్లెట్ రైలుకు సంబంధించిన డ్రైవింగ్ యూనిట్లో అనేక డిస్ప్లే, కమ్యూనికేషన్, ఇతర ఆధునిక వ్యవస్థలు ఉంటాయి. అవి.. నియంత్రణ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ డ్రైవర్కు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయి సమాచారం అందిస్తాయి. వాటి ఆధారంగా చోదకుడు సకాలంలో నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది.
* షింకాన్సెన్ వ్యవస్థ.. ‘క్రాష్ అవాయిడెన్స్’ అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఢీ కొట్టుకోవడానికి అవకాశం లేకుండా దీన్ని రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక హైస్పీడ్ రైల్వే ట్రాక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ మార్గాల్లో ఎలాంటి లెవల్ క్రాసింగ్లు ఉండవు. ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థ ఎప్పటికప్పుడు రైలును వేయి కళ్లతో పరిశీలిస్తుంది. మితిమీరిన వేగంతో రైలు ప్రయాణించకుండా జాగ్రత్త వహిస్తుంది.
* బుల్లెట్ రైళ్లు పట్టాలు తప్పినప్పుడు వాటి బోగీలు.. పక్కనున్న రైల్వే ట్రాక్పై పడి ఆ మార్గంలో వచ్చే రైళ్లను ఢీకొట్టే పరిస్థితి తలెత్తకుండా చూసే ఏర్పాటు ఈ వ్యవస్థలో ఉంది.
* షింకాన్సెన్ రైలు వ్యవస్థ విశ్వసనీయత చాలా ఎక్కువ. ఒక ట్రిప్నకు ఈ రైళ్ల ఆలస్యం.. సరాసరిన ఒక నిమిషం కన్నా చాలా తక్కువే ఉంటుంది. అందువల్ల ప్రయాణికులు సకాలంలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు.
నిరంతర రైలు ఉష్ణోగ్రత పర్యవేక్షణ
ఈ హైస్పీడ్ రైల్వే వ్యవస్థలో అనేక సెన్సర్లతో కూడిన నెట్వర్క్ ఉంటుంది. అది రైలు పట్టాల ఉష్ణోగ్రత, వర్షాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. గాలి తీరుతెన్నులను పరిశీలించడానికి ఎనెమోమీటర్లను ఏర్పాటు చేశారు. ప్రతికూల దిశ నుంచి వీచే గాలి వేగం సెకనుకు 30 మీటర్లు మించితే నియంత్రణ కేంద్రానికి హెచ్చరిక సందేశం వస్తుంది. ఆ వెంటనే సమీపంలోని బుల్లెట్ రైలు నిలిచిపోతుంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం