మెడకు గుచ్చుకొన్న కత్తితోనే బైక్‌ నడుపుతూ ఆస్పత్రికి..

ముంబయి వ్యాపారవేత్త తేజస్‌ పాటిల్‌ (32)పై సొంత సోదరుడు, మరో వ్యక్తి కలిసి కత్తితో దాడి చేశారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న తేజస్‌ మెడ భాగంలో కత్తి గుచ్చుకుపోయి తీవ్రంగా రక్తస్రావం అవుతున్నా ఒక కిలోమీటరు బైక్‌పై ప్రయాణించి ఆస్పత్రికి చేరుకున్నాడు.

Published : 07 Jun 2023 06:50 IST

ముంబయి వ్యాపారవేత్త తేజస్‌ పాటిల్‌ (32)పై సొంత సోదరుడు, మరో వ్యక్తి కలిసి కత్తితో దాడి చేశారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న తేజస్‌ మెడ భాగంలో కత్తి గుచ్చుకుపోయి తీవ్రంగా రక్తస్రావం అవుతున్నా ఒక కిలోమీటరు బైక్‌పై ప్రయాణించి ఆస్పత్రికి చేరుకున్నాడు. నవీ ముంబయిలోని సాన్‌పాడా సెక్టార్‌ 5లో నివసించే తేజస్‌ జూన్‌ 3వ తేదీ రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా.. తమ్ముడు మోనీశ్‌ (30) మరో వ్యక్తితో కలిసి అన్నపై దాడి చేశాడు. మెడపై కత్తితో పొడిచి.. నిందితులు ఇద్దరూ పరారరయ్యారు. తీవ్రమైన నొప్పి భరిస్తూ అలాగే ఆసుపత్రికి చేరుకొన్న తేజస్‌కు వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి కత్తిని తొలగించారు. మెడపై దాడి జరిగినా.. ముఖ్యమైన నరాలు దెబ్బతినలేదు. దీంతో తేజస్‌ ప్రాణాలతో బయటపడ్డారని వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని