కర్బన ఉద్గారాల పరిహారం 170 లక్షల కోట్ల డాలర్లు.. నిజంగా చెల్లిస్తే ప్రతి భారతీయుడికి 1,446 డాలర్లు
భూతాపం పెరుగుదలను 2050కల్లా 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలంటే ప్రపంచ దేశాలు అప్పటికి కర్బన ఉద్గారాల తటస్థత (నెట్ జీరో)ను అందుకోవలసి ఉంటుంది.
దిల్లీ: భూతాపం పెరుగుదలను 2050కల్లా 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలంటే ప్రపంచ దేశాలు అప్పటికి కర్బన ఉద్గారాల తటస్థత (నెట్ జీరో)ను అందుకోవలసి ఉంటుంది. 2015 పారిస్ వాతావరణ సభలో ప్రపంచ దేశాలు భూతాపాన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తామని ప్రకటించినా ఇప్పటికే భూ ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.15 డిగ్రీలకు చేరుకుంది. 2050కల్లా నెట్ జీరో సాధించాలంటే అన్ని దేశాలు తమ వంతు కర్బన ఉద్గారాలను తగ్గించాల్సి ఉంటుంది. దీన్ని కర్బన బడ్జెట్ అంటారు. కానీ, భారత్ వంటి దేశాలు ఈ బడ్జెట్ కన్నా కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేస్తుండగా, అమెరికా, జర్మనీ, రష్యా, బ్రిటన్, జపాన్ నిర్ణీత వాటా కన్నా 90 శాతం ఎక్కువ ఉద్గారాలను వెదజల్లుతున్నాయి. దీనికి అవి పరిహారం చెల్లించాల్సి వస్తే అది 131 లక్షల కోట్ల డాలర్లుగా లెక్కతేలుతుంది. చైనా, ఐరోపా సమాఖ్య (ఈయూ), బ్రెజిల్, ఇండోనేసియా దేశాల ఉద్గారాలనూ కలుపుకొని పరిహారాన్ని లెక్కిస్తే 170 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది. ఆ డబ్బును నిజంగా చెల్లిస్తే భారత్ వాటా కింద ప్రతి భారతీయుడికి 2050 వరకు తలసరిన 1,446 డాలర్ల వార్షిక పరిహారం లభిస్తుందని బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అంచనా.
భూతాపాన్ని 1.5 డిగ్రీల వద్ద కట్టడి చేయడానికి భారత్ తన కర్బన ఉద్గారాలలో భారీగా కోత పెట్టుకున్నందుకు అది సముచిత పరిహారం అవుతుందని వారన్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటూ ఉంటే పారిశ్రామిక సంపన్న దేశాలు అన్యాయంగా ఉద్గారాలను పెంచుతున్నాయని లీడ్స్ పరిశోధకులు అన్నారు. అంతర్జాతీయ కర్బన ఉద్గారాల తలసరి సగటు 6.3 టన్నులయితే భారత్ వాటా కేవలం 2.4 టన్నులని నిరుడు ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ తెలిపింది. సగటున అమెరికా 14 టన్నులు, రష్యా 13, చైనా 9.7, బ్రెజిల్ 7.5 టన్నుల చొప్పున, ఐరోపా సమాఖ్య 7.2 టన్నుల చొప్పున కర్బన ఉద్గారాలను వెదజల్లుతున్నాయి. తమ వాటాకు మించి కర్బన ఉద్గారాలను విరజిమ్ముతున్న దేశాలు, తక్కువ ఉద్గారాలను ప్రసరించే అల్పాదాయ దేశాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ వినవస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
Rafah crossing: రఫాపై దాడి కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. ఇక్కడి సరిహద్దు క్రాసింగ్ను తన ఆధీనంలోకి తీసుకుంది. -
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్