Bhagwant Mann: ‘రాష్ట్రానికి అదో కళంకం.. గ్యాంగ్‌స్టర్లను ఏరిపారేయండి’

శాంతిభద్రతలపై ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించేలా పంజాబ్‌ నుంచి గ్యాంగ్‌స్టర్లను తరిమికొట్టాలని ఆ రాష్ట్ర సీఎం భగవంత్‌....

Published : 09 Apr 2022 02:00 IST

టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు సీఎం భగవంత్‌ మాన్‌ ఆదేశం

చండీగఢ్‌: శాంతిభద్రతలపై ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించేలా పంజాబ్‌ నుంచి గ్యాంగ్‌స్టర్లను తరిమికొట్టాలని ఆ రాష్ట్ర సీఎం భగవంత్‌ మాన్‌ అన్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన గ్యాంగ్‌స్టర్‌ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ (ఏజీటీఎఫ్‌) సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి.. అధికారులకు కీలక సూచనలు చేశారు. పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ల ముప్పును పూర్తిగా తొలగించేందుకు తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. పంజాబ్‌లాంటి శాంతియుత రాష్ట్రానికి ఇదో కళంకమనీ.. గ్యాంగ్‌స్టర్ల ఏరివేతకు తగిన మానవ వనరులు, అధునాతన టెక్నాలజీ, వాహనాలు, తగిన నిధులతో ఏజీటీఎఫ్‌కు పూర్తి సాధికారత కల్పించనున్నట్టు చెప్పారు. పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్లను నిర్మూలించాలనే సంకల్పంతో ఇటీవల సీఎం భగవంత్‌ మాన్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి పలువురు ముఖ్య అధికారులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని