Israel-Palestine: ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంపై కేంద్రం గందరగోళం: శరద్పవార్
ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంలో కేంద్రం వైఖరి గందరగోళంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్పవార్ అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా తప్పుబట్టారు.
దిల్లీ: ఇజ్రాయెల్- పాలస్తీనా (Israel-Palestine) అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి గందరగోళంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్పవార్ (Sharad Pawar) అన్నారు. ఇలాంటి పరిస్థితులను గత ప్రభుత్వాల్లో తానెప్పుడూ చూడలేదని తెలిపారు. హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్కు పూర్తిస్థాయి మద్దతిస్తున్నట్లు ప్రధాని మోదీ (pm Modi) ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. విదేశాంగశాఖ ప్రకటన అందుకు భిన్నంగా ఉండటాన్ని శరద్పవార్ ప్రస్తావించారు. దిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పాలస్తీనాకు మద్దతివ్వడమే భారత్ విధానమని చెప్పారు.
ఇజ్రాయెల్పై హమాస్ దాడుల తర్వాత అక్టోబర్ 8న ప్రధాని మోదీ స్పందిస్తూ.. హమాస్ ఉగ్రవాదుల నరమేధం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. ఇజ్రాయెల్కు భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కూడా ఆయన మాట్లాడారు. అక్కడికి నాలుగు రోజుల తర్వాత భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ ఇదే విషయంపై స్పందిస్తూ.. సార్వభౌమ, స్వతంత్ర పాలస్తీనా నిర్మాణానికి భారత్ మద్దతిస్తుందని ప్రకటించారు. ఇలా కేంద్రం వేర్వేరు ప్రకటనలు చేయడాన్ని శరద్ పవార్ తప్పుబట్టారు. పాలస్తీనాలో వేలాది మంది ప్రజలు మరణిస్తున్నారన్న ఆయన.. గతంలో ఇజ్రాయెల్ పోరాటానికి భారత్ ఎప్పుడూ మద్దతివ్వలేదని చెప్పారు. గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మానంపై భారత్ ఓటింగ్కు దూరంగా ఉండటాన్ని శరద్పవార్ తప్పుబట్టారు. కీలక సమయాల్లో మౌనం వహించడం సరికాదన్నారు. ఇజ్రాయెల్ దాడులపై కేంద్రం వైఖరిని శరద్పవార్ వ్యతిరేకించడం ఇదే తొలిసారి కాదు. గాజాపై ఇజ్రాయెల్ ప్రతిదాడులు తీవ్రతరం చేసిన తర్వాత ఆయన స్పందిస్తూ.. ఇజ్రాయెల్కు భారత్ మద్దతుపలకడం దురదృష్టకరమన్నారు.
షాక్కు గురయ్యా: ప్రియాంక గాంధీ
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉండటంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ వార్త విని షాక్కు గురైనట్లు చెప్పారు. వేలాదిమంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతుంటే.. భారత్ తన విధానాలకు విరుద్ధంగా మౌనంగా ఉండటం సరికాదన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు. ‘‘ గాజాలో కాల్పుల విరమణకోసం ఐక్యరాజ్యమితిలో తీసుకొచ్చిన తీర్మానంపై ఓటు వేసేందుకు భారత్ దూరంగా ఉందని తెలిసి షాక్కు గురయ్యాను. ఇది చాలా ఇబ్బందిగా అనిపించింది. సత్యం, అహింస అనేవి భారతదేశానికి మూలస్తంభాలు. వాటికోసం ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. అంతర్జాతీయ సమాజంలో భారత్ తన గళం వినిపిస్తే.. వాళ్లంతా నైతిక ధైర్యాన్నిస్తారు. అలాంటిది.. ప్రస్తుతం పాలస్తీనాలో సాధారణ ప్రజలకు ఆహారం, నీరు, వైద్యసామగ్రి, విద్యుత్ అందకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకించకుండా మౌనంగా నిలబడటం సమంజసం కాదు’’ అని ప్రియాంకగాంధీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య
హసన సెక్స్ కుంభకోణం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. -
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
‘వందే మెట్రో’ (Vande Metro) పేరుతో సమీప నగరాల మధ్య సరికొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
Salman Khan House Firing Case: సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో ఒక నిందితుడు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
హెచ్పీజెడ్ టోకెన్ యాప్ (HPZ Token App) పెట్టుబడి పేరుతో మోసానికి పాల్పడిన కేసులో సీబీఐ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు చేసింది. -
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
Deepfake videos: లోక్సభ ఎన్నికల సమయంలో డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. -
దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
Bomb threats: దిల్లీ, నోయిడా ప్రాంతాల్లో దాదాపు 100 స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు.
తాజా వార్తలు (Latest News)
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య