Drone Certification: ఇకపై డ్రోన్లకు ధ్రువపత్రం కావాలంటే.. ఆ వివరాలన్నీ సమర్పించాల్సిందే!

కనీస భద్రత, నాణ్యత ప్రమాణాల సాధనే లక్ష్యంగా డ్రోన్ల ధ్రువీకరణ పథకంపై పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది.

Published : 28 Jan 2022 01:43 IST

దిల్లీ: కనీస భద్రత, నాణ్యత ప్రమాణాల సాధనే లక్ష్యంగా డ్రోన్ల ధ్రువీకరణ పథకంపై పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. ఇకపై ధ్రువపత్రం కావాలని దరఖాస్తు చేసుకునేవారు.. డ్రోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. డ్రోన్ బరువు, వేగం, పరిధి, మన్నిక, డ్రోన్‌ను వెనక్కి రప్పించే యంత్రాంగం, తయారీలో వాడిన సామగ్రి తదితర వివరాలన్నీ అందించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. డ్రోన్లకు ధ్రువీకరణను సులభంగా, వేగంగా, పారదర్శకంగా అనుమతులు ఇచ్చేందుకు తాజా ఆదేశాలు దోహదపడుతాయని పేర్కొంది. దిగుమతిదారులకు, విడిభాగాలను తెచ్చి ఒకటిగా అమర్చేవారికి తాజా ఆదేశాలు వర్తిస్తాయని పౌర విమానయానశాఖ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని