Jammu IAF Station: డ్రోన్‌ కౌంటర్‌ వ్యవస్థ ఏర్పాటు

వరుస డ్రోన్‌ దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని జాతీయ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శత్రు డ్రోన్లను ఎదుర్కొనేందుకు జమ్మూలోని వైమానిక స్థావరంలో

Published : 30 Jun 2021 22:18 IST

జమ్ము: వరుస డ్రోన్‌ దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని జాతీయ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శత్రు డ్రోన్లను ఎదుర్కొనేందుకు జమ్మూలోని వైమానిక స్థావరంలో ‘డ్రోన్‌ కౌంటర్‌ వ్యవస్థ’ను బుధవారం ఏర్పాటు చేశాయి. కొత్తగా డ్రోన్ల ద్వారా ముంచుకొస్తున్న ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థలో మార్పులు చేస్తున్నట్లు ఆధికార వర్గాలు వెల్లడించాయి. అందులో భాగంగా జమ్మూ వైమానిక స్థావరంలో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్‌, జామర్లను అమర్చడం సహా డ్రోన్‌ విధ్వంసక తుపాకులను మోహరించినట్లు తెలిపాయి. ఈ నెల 27న జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలసిందే. మరుసటి రోజు రత్నుచక్‌-కాలుచక్‌ స్థావరాలపైనా డ్రోన్‌ దాడికి యత్నించగా.. భారత బలగాలు తిప్పికొట్టాయి. వరుసగా నాలుగో రోజూ జమ్మూలోని మూడు ప్రాంతాల్లో డ్రోన్ల సంచారం కలకలం రేపింది. భారత్‌కు చెందిన కీలక స్థావరాలపై డ్రోన్ల ద్వారా పాకిస్థాన్‌ దాడులకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.     

 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని