Manipur Violence: మణిపుర్లో మరోసారి రెచ్చిపోయిన ఆందోళనకారులు.. ముగ్గురి మృతి
మణిపుర్ (Manipur)లో మరోసారి సాయుధ మూకలు రెచ్చిపోయాయి. కొండ ప్రాంతం నుంచి గ్రామస్థులపై విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.
ఇంఫాల్: తెగల మధ్య వైరం కారణంగా గత వందరోజులుగా హింసాత్మకంగా మారిన మణిపుర్ (Manipur)లో మరోసారి అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఉఖ్రుల్ (Ukhrul) జిల్లాలో శుక్రవారం ఉదయం సాయుధులైన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఉఖ్రుల్ జిల్లా పోలీసు అధికారి ఎన్. వాషుమ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి 47 కి.మీ దూరంలో కుకీ తెగవారు నివసించే తోవాయి కుకీ అనే గ్రామంపైకి ఉదయం 4:30 గంటల ప్రాంతంలో కొండపై నుంచి సాయుధ మూకలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాల్పులు జరిపిన వారి కోసం రాష్ట్ర పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు.
మణిపుర్లో సురక్షిత ప్రాంతాలకు పోలీసులు సహా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ..!
మణిపుర్లో శాంతి నెలకొల్పేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు కుకీ-జో తెగల నివాసిత ప్రాంతాలకు స్వయంప్రతిపత్తిని ప్రకటించాలని గిరిజన మహిళల వేదిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో చెలరేగిన హింస కారణంగా సుమారు 160 మంది ప్రాణాలు కోల్పోగా, మూడు వేల మంది వరకు గాయపడ్డారు. ఆందోళనలను కట్టడి చేసి, శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు 40 వేల కేంద్ర బలగాలను మోహరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యడియూరప్పపై అరెస్ట్ వారెంట్
Yediyurappa: పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. -
భారత్లా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం..? పాక్ నేత వీడియో వైరల్
India-Pakistan: పొరుగు దేశం భారత్లా తాము ఎందుకు ఉండలేకపోతున్నామంటూ పాకిస్థాన్ నేత ఒకరు ఆందోళన వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
నీట్ వ్యవహారం.. ‘సుప్రీం’ పర్యవేక్షణలో దర్యాప్తు చేయండి: ఖర్గే డిమాండ్
NEET UG 2024| వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ (యూజీ) పరీక్షపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ¸కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
భారత్-చైనా టెన్షన్లు తగ్గాలంటే సమష్టి ప్రయోజనాలను గుర్తించాలి: అమెరికా
జిన్పింగ్ సర్కారు పొరుగు దేశాలతో సమస్యల పరిష్కారం విషయంలో ఎటువంటి పట్టువిడుపు ధోరణులు ప్రదర్శించడం లేదని అమెరికా విమర్శించింది. -
దిల్లీలో నీటి సంక్షోభం వేళ.. సుప్రీంకోర్టులో హిమాచల్ యూటర్న్
Delhi water crisis: సుప్రీంకోర్టుకు చేరిన దిల్లీ నీటి సంక్షోభం అంశం పలు మలుపులు తీసుకుంటుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ చేసిన వాదనపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. -
దిండుతో ఊపిరాడకుండా చేసి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక వివరాలు
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ హత్య కేసులో మరిన్ని విషయాలు బయటకొచ్చాయి. నేపాల్లో అరెస్ట్ అయిన నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో మరికొంత పురోగతి కనిపించింది. -
మాజీ సీఎం సతీమణి.. ఆ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రి
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) చరిత్రలో తొలిసారి ఓ మహిళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. -
సన్నీ లియోన్ ప్రదర్శనకు ఆ యూనివర్సిటీ ‘నో’!
నటి సన్నీ లియోన్ తలపెట్టిన ఓ ప్రదర్శనకు కేరళ యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది. -
రాజకీయాల కంటే సినిమాలు చేయడమే సులువు.. కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు
రాజకీయ జీవితం గడపడం కంటే సినిమాలు చేయడమే సులువంటూ ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అభిప్రాయం వ్యక్తంచేశారు. -
యడియూరప్పను అరెస్టు చేయవచ్చు: కర్ణాటక మంత్రి
కర్ణాటకలో భాజపా అగ్రనేత బీఎస్ యడియూరప్ప అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. పోక్సో కేసులో ఆయన్ను అవసరమైతే సీఐడీ అదుపులోకి తీసుకోవచ్చని రాష్ట్ర హోం మంత్రి పేర్కొన్నారు. -
కోన్ ఐస్క్రీంలో మనిషి వేలు.. ముంబయి డాక్టర్కు చేదు అనుభవం
ఐస్క్రీముల్లో పురుగులు రావడం గురించే మనం విని ఉంటాం.. ఇప్పుడు మానవ అవయవాలు కూడా వస్తున్నాయి. ముంబయిలోని ఓ డాక్టర్కు ఈ అనుభవం ఎదురైంది. -
నీట్ పరీక్షలో ఆ 1500 మందికి గ్రేస్ మార్కులను తీసేస్తాం: సుప్రీంకు కేంద్రం వెల్లడి
NEET UG Exam: ఈ ఏడాది నీట్ పరీక్షలో 1563 మందికి ఇచ్చిన గ్రేస్ మార్కులను తీసేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొంది. -
పుణె కారు ప్రమాదం కేసు: బయటపడుతున్న డాక్టర్ క్రిమినల్ నెట్వర్క్..!
పుణెలో తప్పతాగిన మైనర్ పోర్ష్ కారును డ్రైవింగ్ చేసి ఇద్దరు ప్రాణాలు తీసిన కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆధారాలు తారుమారు చేసిన డాక్టర్ వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. -
మోదీ ‘తాడాసనం’ చూశారా.. తన గ్రాఫిక్ వీడియో షేర్ చేసిన ప్రధాని
అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తోన్న తరుణంలో ప్రధాని మోదీ(Modi) ఒక వీడియోను షేర్ చేశారు. -
ఆ తూటాల శబ్దంతోనే నిద్రలేచా.. కాల్పుల ఘటనపై సల్మాన్ఖాన్ వాంగ్మూలం
Salman Khan: తన ఇంటిపై దుండగులు కాల్పులు జరిపిన రోజు తాను ఇంట్లోనే ఉన్నానని నటుడు సల్మాన్ ఖాన్ తెలిపారు. ఆ తూటాల శబ్దంతోనే నిద్రలేచానని అన్నారు. -
కేంద్ర బడ్జెట్.. వర్షాకాల సమావేశాల్లోనే!
కొత్తగా ఏర్పడిన 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈనెల 24 నుంచి జులై 3వ తేదీవరకు జరగనుండడం ఖాయమైంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. -
ట్యాంకర్ మాఫియాపై ఏం చర్యలు తీసుకున్నారు?
దేశ రాజధాని ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి సమస్యపై దిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ట్యాంకర్ మాఫియా కట్టడికి, నీటి వృథా నివారణకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. -
‘నీట్’పై నేడు సుప్రీంలో విచారణ
ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ నిర్వహించనుంది. -
ఒడిశాలో కొలువుదీరిన భాజపా ప్రభుత్వం
ఒడిశాలో తొలిసారి భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్ చరణ మాఝి బుధవారం సాయంత్రం భువనేశ్వర్ జనతా మైదానంలో.. ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. -
ఉగ్రవాదికి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి
దేశ రాజధానిలో కాల్పులకు పాల్పడిన ఓ ఉగ్రవాది.. తన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. -
4 దశాబ్దాల్లో 40 శాతం పెరిగిన నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు
పుడమిని వేడెక్కించే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు.. 1980 నుంచి 2020 మధ్య ఏకంగా 40 శాతం పెరిగాయని ఓ నివేదిక పేర్కొంది. ఇందులో చైనా మొదటి స్థానంలో ఉందని తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆమె కోసం హత్య కేసులో ఇరుకున్న దర్శన్.. ఎవరీ పవిత్ర గౌడ..?
-
‘ఐదేళ్లు కళ్లు మూసుకున్నాం.. మరో ఐదేళ్లు కళ్లు మూసుకోండి’ జగన్ కామెంట్స్ వైరల్
-
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యడియూరప్పపై అరెస్ట్ వారెంట్
-
చిన్న గాయమే కానీ.. లావణ్య త్రిపాఠి క్లారిటీ
-
సీఎం చంద్రబాబును కలిసేందుకు వివాదాస్పద అధికారుల ప్రయత్నాలు
-
నీ లేఖ నా మనసును హత్తుకుంది: నారా రోహిత్ లేఖకు చంద్రబాబు రిప్లై