India Corona: నిన్నటి కంటే 24 శాతం అధికంగా కరోనా కేసులు..!

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 4.52 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 2,628 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది.

Published : 26 May 2022 10:08 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 4.52 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 2,628 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే 24 శాతం మేర అధికంగా కేసులొచ్చాయి. నిన్న 2,167 మంది కోలుకున్నారు. కొత్త కేసుల పెరుగుదలతో క్రియాశీల కేసులు 15,414కు ఎగబాకాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.04 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో 18 మంది మరణించగా.. ఇప్పటివరకూ 5.24 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. ఈ వైరస్ కట్టడికి కేంద్రం ప్రారంభించిన టీకా కార్యక్రమం కింద 192 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 13.13 లక్షల మంది టీకా వేయించుకున్నారని గురువారం కేంద్రం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని