గత్యంతరం లేకే కాల్పుల విరమణకు అంగీకారం!
భారత్ శాంతి మంత్రాన్ని దాయాది దేశం ఒడిసిపట్టుకుందా అన్నంతగా సరిహద్దుల్లో తుపాకీ మోతలు నిలిచిపోయాయి. వారంరోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ దళాలు తూచా తప్పకుండా పాటిస్తున్నాయి....
ఉగ్రవాద ముద్రను చెరిపేసుకునేందుకు పాక్ తంటాలు
ఇంటర్నెట్ డెస్క్: భారత్ శాంతి మంత్రాన్ని దాయాది దేశం ఒడిసిపట్టుకుందా? అన్నంతగా సరిహద్దుల్లో తుపాకీ మోతలు నిలిచిపోయాయి. వారంరోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ దళాలు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. పాకిస్థాన్ వైఖరిలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పుల వెనక తప్పనిసరి కారణాలు చాలానే ఉన్నాయి. సీమాంతర ఉగ్రవాదం అన్నది పాకిస్థాన్ విదేశీ విధానాల్లో ఒకటిగా మారిందన్నది భారత్ ఆరోపణ. దీనికి తగ్గట్టుగానే భారత్ను అస్థిరపరిచేందుకు ముష్కర మూకను దేశం మీదికి ఎగదోస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఉగ్ర ముఠాలకు ఆవాసంతోపాటు ఆర్థిక సాయం అందిస్తూ అనేక సార్లు అంతర్జాతీయ సమాజం ఎదుట అడ్డంగా దొరికిపోయింది.
ఆర్థికంగా చితికి..
ఉగ్రవాదంతోపాటు అంతర్గతంగా ఉన్న సమస్యలు, రాజకీయ పరమైన సమస్యలు పాకిస్థాన్ను ఆర్థికంగా చితికిపోయేలా చేశాయి. ప్రతి కార్యక్రమానికి ఇతరుల వద్ద దేబరించాల్సిన దుస్థితికి దిగజారింది. ఈ తరుణంలో ఆర్థిక చర్యల కార్యచరణా దళం (ఎఫ్ఏటీఎఫ్) కూడా గ్రే కొరడా ఝుళిపించడంతో వచ్చే నిధులు కూడా నిలిచిపోయాయి. ఉగ్ర ముద్ర పోగొట్టుకుంటే తప్ప దాయాది దేశానికి పైసా రాలని పరిస్థితి. అందుకే ఆ మరక చెరిపేసుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఆ వార్తలతో ఉక్కిరిబిక్కిరి
అబొట్టాబాద్లో అల్ఖైదా అగ్ర నేతను అమెరికా దళాలు అంతమొందించడం సహా పాకిస్థాన్ రాజకీయ నాయకులతో బిన్ లాడెన్ ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఇటీవల వెలువడిన వార్తలు పాక్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో ఎఫ్ఏటీఎఫ్ విధించిన గడువు కూడా ముంచుకొస్తుండటంతో తమ శత్రు దేశంగా భావించే భారత్తో శాంతి మంత్రం జపించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కఠినంగా అమలు చేయాలన్న భారత్ నిర్ణయానికి జై కొట్టడమే కాకుండా వాస్తవ రూపంలోకి తేవడంతో సరిహద్దుల్లో తుపాకుల మోతలు నిలిచిపోయాయి.
ఆగిన ఉగ్రమూకల ఎగుమతి
పాక్ సైన్యం సాయంతోనే ముష్కరులు ఇన్నాళ్లూ భారత్లోకి ప్రవేశించగలుగుతూ వచ్చారు. ఇష్టారీతిన భారత దళాలపై కాల్పులకు తెగబడుతూ ఉగ్రమూకలు భారత్లోకి వెళ్లేందుకు పాక్ సైన్యం అవకాశాలు కల్పించేది. ఇప్పుడు ఈ కాల్పులు ఆగాయంటే సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి పలికేందుకు ఇమ్రాన్ నేతృత్వంలోని పాక్ సమాయాత్తమవుతున్నట్లే. దీని ద్వారా ఎఫ్ఏటీఎఫ్ నిషేధం నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఈ నిర్ణయం దాయది నేలపై ఉన్న ఉగ్ర ముఠాలకు ఏమాత్రం రుచించకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ అంగీకరించాల్సి వచ్చింది.
నిర్మాణాలకు ఆటంకం కలగొద్దని..
ఎఫ్ఏటీఎఫ్తో పాటు మరో విషయం కూడా పాకిస్థాన్ను కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా ప్రేరేపించింది. పాక్ నేలపై చైనా తలపెట్టిన సీపీఈసీ కారిడార్ పనులు ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగాలంటే సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం అత్యావశ్యం. ఇప్పటికే గిల్గిట్ బాల్టిస్థాన్ను పాక్లోని ఓ ప్రావిన్స్గా మారుస్తూ దాయాది అవసరమైన రాజ్యాంగ పరమైన ప్రక్రియను పూర్తి చేసింది. తద్వారా సీపెక్ వేగవంతమవుతుంది. చైనా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్ఐ ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతం మీదుగానే వెళుతుంది. ఈ మొత్తం విషయాల్లో భారత్ ఎక్కువగా స్పందించకుండా ఉండాలంటే భారత్తో సరిహద్దుల్లో కయ్యం లేకుండా ఉండితీరాలి. ఇవన్నీ జరగాలంటే సరిహద్దుల్లో భారత్ వైపు గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి. భారత భూభాగంలోకి ఉగ్రమూకల రాకపోకలు నిలిచిపోవాలి. అటు భారత్ కూడా జమ్మూకశ్మీర్లో చేపట్టే ప్రాజెక్టులు వేగంగా సాగాలని కోరుకుంటోంది. అందుకు ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనడం అవసరం. అందుకే ఉభయతారకంగా భారత్ చేసిన ప్రతిపాదనను పాక్ వెంటనే అమలుచేసి చూపించింది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎంతకాలం పటిష్ఠంగా అమలవుతుంది అన్నదానిపై సందేహాలు అలానే ఉన్నాయి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం