Tourism: ఈ దేశాల్లో పర్యటన.. భారతీయులకు చాలా సులువు
ప్రపంచంలో కొన్ని దేశాలు భారతీయులకు ఈ వీసా (e visa), వీసా ఆన్ అరైవల్ (Visa On Arrival) సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. దీని ద్వారా అత్యంత సులువుగా ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుంటుంది.
ఇంటర్నెట్డెస్క్: సరదాగా కొన్ని రోజుల పాటు విదేశాల్లో పర్యటించి వద్దామనుకునే వారికి వీసా అతిపెద్ద సమస్య. అనుకున్న సమయానికి వీసా రాకపోవడం, అది వచ్చేటప్పటికి సమయం కుదరకపోవడం లాంటి సమస్యలతో చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటూ వస్తారు. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాలకు వెళ్లేందుకు భారతీయులకు ప్రత్యేకించి వీసా అక్కర్లేదు. ఆయా దేశాలే మనవాళ్లకు ఈ-వీసాలు, వీసా ఆన్ అరైవల్ ఏర్పాటు చేస్తున్నాయి. దీనికోసం పర్యాటకులు ట్రావెల్ ప్లాన్ విషయాలను నమోదు చేస్తూ ఒక దరఖాస్తు నింపితే సరిపోతుంది. మరి ఆ దేశాలేంటో.. వీసాకు ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందామా?
1. మాల్దీవులు (Maldives)
కొత్తగా పెళ్లయిన జంటలు విహారయాత్రకు వెళ్లాలనుకుంటే మాల్దీవ్లు సరైన ప్రదేశం. అక్కడికి చేరుకున్న వెంటనే 30 రోజుల పాటు ఉండేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వం ‘వీసా ఆన్ అరైవల్’ సమకూరుస్తోంది. ఇక ఈ దేశంలో పర్యటకులు సంతోషంగా గడపడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఎన్నో సాహసోపేతమైన క్రీడల్లోనూ పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భారతీయులకు ఎలాంటి రుసుము తీసుకోకుండానే అక్కడి ప్రభుత్వం వీసాలు మంజూరు చేస్తోంది.
2. థాయ్లాండ్ (Thailand)
థాయ్లాండ్లో చూడదగ్గ ప్రదేశాల్లో బ్యాంకాక్, క్రబి, ఫుకెట్,ఫిఫీ దీవులు ముందువరుసలో ఉంటాయి. రకరకాల ఆహార పదార్థాలు, నైట్క్లబ్లు ఇక్కడి ప్రత్యేకత. థాయ్లాండ్లో 15 రోజులు పాటు ఉండాలనుకునే వారు కేవలం 35 అమెరికా డాలర్లు చెల్లించి పర్యాటక వీసాను పొందొచ్చు. అంటే దాదాపు రూ.2,864తో 15 రోజులపాటు థాయ్లాండ్ దీవుల్లో పర్యటించొచ్చన్నమాట.
3. కాంబోడియా (Cambodia)
ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారికి కాంబోడియా సరైన ప్రదేశం. ఇక్కడ దేవాలయాలు, అడవులు.. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రకృతి రమణీయత పర్యాటకులను కట్టిపడేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి వెళ్లేందుకు ఈ-వీసా పొందాలనుకునే వారు నెలకు రూ.2,970 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
4. ఇండోనేసియా (Indonesia)
మనోహరమైన బీచ్లకు ఇండోనేసియా ప్రసిద్ధి. నోరూరించే ప్రత్యేక వంటకాలకు ఇది నెలవు. బీచ్లో సేదతీరుతూ ఎంజాయ్ చెయ్యడానికే ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. అంతేకాకుండా పర్యాటకులతో ఇక్కడి ప్రజలు మమేకమయ్యే తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇండోనేసియా పర్యాటక వీసా కావాలంటే రెండు నెలలకు రూ. 2,400 చెల్లించాల్సి ఉంటుంది.
5. శ్రీలంక (Sri Lanka)
భారతదేశానికి దక్షిణ దిక్కున అతి సమీపంలో ఉన్న శ్రీలంక విభిన్న వృక్షజాతులకు నెలవు. ఇక్కడి బీచ్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడి వెళ్లాలనుకునేవారు ఈ-వీసా కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం రూ.2,475 చెల్లించాల్సి ఉంటుంది.
6. వియత్నాం (Vietnam)
జాతీయ ఉద్యానవనాలు, చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలను దర్శించాలనుకునేవారికి ఇది చక్కని ప్రదేశం. ఇక్కడి ఫక్ష, బన్చా లాంటి ప్రాంతీయ వంటకాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఉష్ణమండల పర్యాటక ప్రదేశాల్లో వియత్నాం ఒకటి. 30 రోజుల పాటు ఇక్కడ బసచేసేందుకు వీలుగా భారతీయులకు అతితక్కువ ధరకే ఈ వీసాలను మంజూరు చేస్తోంది. అయితే కనిష్ఠంగా 30 రోజులు గరిష్ఠంగా 90 రోజుల పాటు ఇక్కడ బస చేయాల్సి ఉంటుంది. దీని కోసం రూ.7841 చెల్లించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది. -
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
జమ్మూ-కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో అయిదుగురు జవాన్లు గాయపడ్డారు. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
మహిళ అపహరణ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. -
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
సందేశ్ఖాలీ ఘటనలు భాజపా ముందస్తు కుట్రేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. -
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి భాజపా చేసే విమర్శలను ఆప్(AAP) తిప్పికొట్టింది. తనవారి కోసమే ఆ పార్టీ పని చేస్తుందని దుయ్యబట్టింది. -
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఏకంగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికారులను షాక్కు గురిచేసింది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
తన కుమారుడు నామినేషన్ వేసిన సందర్భంగా భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) తన బలాన్ని ప్రదర్శించారు. వేల సంఖ్యలో మద్దతుదారులతో భారీ సభను నిర్వహించారు. -
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
Hamida Banu: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా? అందులో కన్పిస్తున్న వ్యక్తి భారత మహిళా రెజ్లర్ హమీదా బాను. ఇంతకీ ఎవరామే? ఏంటామె ప్రత్యేకత? -
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
ముందు రాయ్బరేలీలో గెలువు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన పోస్టుపై గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov) వివరణ ఇచ్చారు. -
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
రష్యా వాంటెడ్ లిస్ట్లో జెలెన్స్కీ..!
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM