Mahua Moitra: ‘మహువా’పై ఆరోపణల వ్యవహారం.. లోక్సభ నైతిక విలువల కమిటీకి సిఫార్సు
డబ్బులు తీసుకొని లోక్సభలో ప్రశ్నలు అడిగారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ఫిర్యాదును స్పీకర్ ఓం బిర్లా.. లోక్సభ నైతిక విలువల కమిటీకి సిఫార్సు చేశారు.
దిల్లీ: పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై భాజపా ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటరీ హక్కుల ఉల్లంఘన, సభా ధిక్కారం, నేరపూరిత కుట్రలకు పాల్పడినందుకుగానూ వెంటనే మహువాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తాజాగా స్పీకర్ ఓం బిర్లా ఈ ఫిర్యాదును లోక్సభ నైతిక విలువల కమిటీ (Lok Sabha Ethics Committee)కి సిఫార్సు చేశారు. ఈ కమిటీకి ప్రస్తుతం భాజపా సభ్యుడు వినోద్ కుమార్ సోన్కర్ అధ్యక్షత వహిస్తున్నారు.
అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొనేందుకు ఎంపీ మహువా మొయిత్రా.. ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు, బహుమతులు తీసుకున్నారంటూ నిషికాంత్ తన లేఖలో ఆరోపించారు. దీంతోపాటు మొయిత్రా తన లోక్సభ వెబ్సైట్ లాగిన్ వివరాలనూ (క్రెడెన్షియల్స్) ఇతరులకు అందజేసినట్లు తెలిసిందని, దానిపై దర్యాప్తు చేపట్టాలని ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కూ లేఖ రాశారు. అయితే, దుబే ఆరోపణలను మహువా ఇప్పటికే ఖండించారు. ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణ జరిగినా సిద్ధమేనన్నారు. దుబేతో పాటు ఓ న్యాయవాదికి లీగల్ నోటీసులు పంపించారు.
పార్లమెంటులో ప్రశ్నలకు మహువా డబ్బు తీసుకున్నారు
ఇదిలా ఉండగా.. ‘నైతిక విలువల కమిటీ’ని లోక్సభలో 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ పార్లమెంటు సభ్యులు అనుసరించాల్సిన ప్రవర్తనా నియమావళిని, అమలు తీరును పర్యవేక్షిస్తుంది. సభ్యులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడంతోపాటు వారిపై చేపట్టాల్సిన చర్యలను సూచిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మాణంలో మేటి.. తాజ్ మహల్కు పోటీ..!
ఆగ్రాలో ఓ నిర్మాణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అదే.. రాధాస్వామి అనే ఆధ్యాత్మిక సంప్రదాయానికి పునాది వేసిన ‘శివ్ దయాళ్ సింగ్’ సమాధి. -
మద్యం కేసులో కేజ్రీవాల్పై ఈడీ ఛార్జ్షీట్.. నిందితుల జాబితాలో ఆప్ పేరు
Arvind Kejriwal: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ మరో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నిందితుల జాబితాలో ఆమ్ఆద్మీ పార్టీ పేరును చేర్చింది. -
చార్ ధామ్లో ఇకపై రీల్స్ చిత్రీకరణ నిషిద్ధం
చార్ ధామ్లో ఇకపై వీడియోలు తీయడం నిషేధిస్తున్నట్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. -
అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వు
తన అరెస్టును సవాల్ చేస్తూ దిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. -
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసంలోనివిగా భావిస్తోన్న కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై స్వాతీమాలీవాల్ స్పందించారు. -
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్పై జరిగిన భౌతిక దాడి సిగ్గుచేటని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. -
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ
ఆ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖలో టెండర్ దక్కాలంటే మంత్రిగారికి 1.5శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనంట. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ ఈడీ కోర్టుకు వెల్లడించింది. -
మోదీపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థం లేనివి: రాజ్నాథ్ సింగ్
ప్రధాని మోదీపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. -
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నా ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
-
నిర్మాణంలో మేటి.. తాజ్ మహల్కు పోటీ..!
-
అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్ నోటీసులు
-
మద్యం కేసులో కేజ్రీవాల్పై ఈడీ ఛార్జ్షీట్.. నిందితుల జాబితాలో ఆప్ పేరు
-
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్