
Online Payments: దేశంలో నిత్యం రూ.20వేల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు..!
చిన్నచెల్లింపులే పెద్ద ఆర్థికవ్యవస్థకు ఊతం ఇస్తున్నాయన్న ప్రధాని మోదీ
దిల్లీ: దేశంలో నిత్యం రూ.20వేల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇవి కేవలం సౌకర్యాలను పెంచడమే కాకుండా నిజాయితీతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. చిన్న ఆన్లైన్ చెల్లింపులే పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో దోహదం చేస్తున్నాయన్న మోదీ.. ఈ క్రమంలో కొత్తగా ఎన్నో ఫిన్టెక్ స్టార్టప్లు వస్తున్నాయని అన్నారు. ప్రతినెల చివరి ఆదివారం నాడు దేశప్రజలనుద్దేశించి నిర్వహించే ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ఈ విధంగా ప్రసంగించారు.
‘దేశవ్యాప్తంగా ప్రతిరోజు రూ.20వేల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. కేవలం ఒక్క మార్చి నెలలోనే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలు రూ.10లక్షల కోట్లకు చేరుకున్నాయి’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇవి కేవలం సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా నిజాయితీ గల వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నాయన్న మోదీ.. డిజిటల్ చెల్లింపులు, స్టార్టర్కు సంబంధించిన సొంత అనుభవాలను ఇతరులతోనూ పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇలా పంచుకునే స్వీయ అనుభవాలే దేశంలో ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని సూచించారు.
ఇక ఏప్రిల్ 14న బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించిన ప్రధానమంత్రి సంగ్రహాలయానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎంతో మంది లేఖలు, మెసేజ్లు పంపిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రుల సేవలకు గుర్తుగా వారిని స్మరించుకునేందుకు 75వ స్వాతంత్ర్య వేడుకలకు మించి మరో మంచి సమయం లేదన్నారు. ఇక క్రీడల్లో మాదిరిగా ఆర్ట్స్, విద్యారంగంతో పాటు ఇతర రంగాల్లో దివ్యాంగులు ఎన్నో విజయాలు సాధిస్తున్నారని మోదీ గుర్తుచేశారు. సాంకేతికతను ఉపయోగించుకొని దివ్యాంగులు ఉన్నత శిఖరాలను సాధించగలుగుతున్నారంటూ వారిని ప్రశంసించారు. ఇక మే నెలలో వచ్చే పండుగల సందర్భంలో ప్రజలు తప్పకుండా కొవిడ్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rohit Sharma : రోహిత్ శర్మ.. ఒకే ప్రపంచకప్లో అత్యధిక సెంచరీల రికార్డు
-
General News
Hyderabad: వైభవంగా ప్రారంభమైన జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి శాకంబరి ఉత్సవాలు
-
India News
Mahua Moitra: ‘కాళీ’ వివాదం.. మహువాపై కేసు నమోదు..!
-
India News
Bhagwant Mann: రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్ మాన్!
-
Movies News
Archana: ‘మగధీర’లో అవకాశాన్ని అలా చేజార్చుకున్నా: అర్చన
-
Sports News
Joe root: కోహ్లీ,స్మిత్లను దాటేసిన రూట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య