Winter Olympics: వింటర్ ఒలింపిక్స్ ఏర్పాట్ల జోరు.. వేల సిబ్బంది బబుల్లోకి!
కరోనా కట్టడికి ‘జీరో కొవిడ్’ వ్యూహాన్ని అమలు చేస్తూ.. చైనా ప్రభుత్వం స్థానికంగా కఠిన ఆంక్షలు విధిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జియాన్, యనాన్ నగరాల్లో లాక్డౌన్ విధించగా.. తాజాగా మూడు అసింప్టమేటిక్ కేసులు బయటపడటంతో హెనాన్ ప్రావిన్స్లోని...
బీజింగ్: కరోనా కట్టడికి ‘జీరో కొవిడ్’ వ్యూహాన్ని అమలు చేస్తూ.. చైనా ప్రభుత్వం స్థానికంగా కఠిన ఆంక్షలు విధిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జియాన్, యనాన్ నగరాల్లో లాక్డౌన్ విధించగా.. తాజాగా మూడు అసింప్టమేటిక్ కేసులు బయటపడటంతో హెనాన్ ప్రావిన్స్లోని యుజౌ నగరంలో 10 లక్షల మందిని ఇళ్లకు పరిమితం చేసింది. మరోవైపు వింటర్ ఒలింపిక్స్కు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. తాజాగా.. క్రీడా వేదికలు, రవాణా, సిబ్బంది నిర్వహణ పనులు మొదలుపెట్టింది. వైరస్ దరిచేరకుండా ఉండేందుకుగానూ.. మంగళవారం వేలకొద్ది సిబ్బంది, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు తదితరులను క్లోజ్డ్ లూప్(బబుల్)లో ప్రవేశపెట్టింది. కొన్ని వారాలపాటు వారు అందులోనే ఉండనున్నారు. చైనాలో ఫిబ్రవరి 4- 20 వరకు వింటర్ ఒలింపిక్స్ జరగనున్న విషయం తెలిసిందే.
బీజింగ్లో అడుగుపెట్టనున్న దాదాపు మూడు వేల మంది అథ్లెట్లు, సిబ్బంది, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు తదితరులూ బబుల్ ఉండనున్నారు. రోజూ వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ ఏర్పాట్లు కొలిక్కి వచ్చినట్లు ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ మీడియా విభాగాధిపతి జావో విడాంగ్ వెల్లడించారు. క్రీడా వేదికలు, హోటళ్లు, రవాణా అన్నీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వేదికలు బీజింగ్ వెలుపల ఉండటంతో.. రాకపోకలకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే, చైనాలోని విదేశీ దౌత్యవేత్తలు మాత్రం.. ఒలింపిక్స్ విషయంలో ప్రభుత్వ ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయని వాపోతున్నారు! ఇలాగైతే బబుల్లోని తమ జాతీయులకు సరైన సాయం అందించలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM