అక్కడ వేలల్లో పెళ్లికాని ప్రసాదులు.. వధువుల కోసం ఉత్తరాదిలో వేట!
పెళ్లి వయసు దాటిపోతున్న సుమారు 40వేల మంది సమస్య. అందుకే తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్ (తంబ్రాస్) ఓ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది.
చెన్నై: ‘‘పెళ్లెప్పుడవుతుంది బాబూ.. నీకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు’’ ఓ తెలుగు సినిమాలోని పాట ఇది. సరిగ్గా ఇప్పుడు ఈ వాక్యాలు తమిళ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువకులకు ఇట్టే సరిపోతాయి. కేవలం ఒకరిద్దరి సమస్య మాత్రమే కాదు.. పెళ్లి వయసు దాటిపోతున్న సుమారు 40వేల మంది సమస్య. అందుకే తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్ (తంబ్రాస్) ఓ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇక్కడి పెళ్లికాని ప్రసాదులకు యూపీ, బిహార్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన పెళ్లి కుమార్తెలను వెతికే పనిలో పడింది. దీనికి సంబంధించి ఓ తమిళ మ్యాగజైన్లో ఆ సంఘం అధ్యక్షుడు నారాయణన్ ఓ బహిరంగ ప్రకటన ఇచ్చారు.
రాష్ట్రంలో 30-40 ఏళ్ల వయసున్న వారు పెళ్లికాకుండా ఉన్న తమిళ బ్రాహ్మణుల సంఖ్య సుమారు 30-40 వేలకు వరకు ఉంటుందని నారాయణన్ తెలిపారు. తమిళనాడు పరిధిలో వారికి సరిపడా సంబంధం దొరకడం లేదన్నారు. 10 మంది అబ్బాయిలకు కేవలం ఆరుగురు మాత్రమే అమ్మాయిలు దొరుకుతున్నారని, మిగిలిన వారికి వివాహ వయసు మీరిపోతోందని చెప్పారు. అందుకే దిల్లీ, లఖ్నవూ, పట్నాలో సమన్వయకర్తలను నియమించుకోనున్నట్లు వెల్లడించారు. హిందీ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చిన వారిని ఆయా చోట్ల సమన్వయకర్తలుగా నియమించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే లఖ్నవూ, పట్నాలోని కొందరితో మాట్లాడుతున్నామన్నారు. బ్రాహ్మణ సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వివాహాల గురించి కొందరు తమ అభిప్రాయాలను ‘పీటీఐ’ వార్తా సంస్థతో పంచుకున్నారు. వివాహ వయసు వచ్చిన ఆడపిల్లలు లేకపోవడం వల్లే పెద్ద ఎత్తున యువకులు పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారని విద్యావేత్త పరమేశ్వరన్ అన్నారు. అదే సమయంలో పెళ్లికొడుకు తల్లిదండ్రుల వైఖరిలోనూ మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. చాలా మంది హంగూ ఆర్బాటాలతో కూడిన వివాహం జరగాలని కోరుకుంటున్నారని, పెళ్లి ఖర్చంతా భరించే ఆనవాయితీ ఉన్న పెళ్లి కుమార్తె కుటుంబానికి అది భారంగా మారుతోందని చెప్పారు. రెండు మూడ్రోజులు సాగే ఈ వివాహ తంతుకు సుమారు రూ.12-15 లక్షలు ఖర్చువుతోందని తెలిపారు. ఆర్థికంగా ఉన్నవారికి పర్లేదు గానీ, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారు అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటేనే ఏళ్ల పాటు కూడబెట్టాల్సిన పరిస్థితి నెలకొందని, ఇలాంటి అహాన్ని పక్కనపెడితే తమిళనాడులోనే అమ్మాయిలు దొరుకుతారని పేర్కొన్నారు. తమిళ- తెలుగు బ్రాహ్మణుల వివాహాలు, కన్నడ బ్రాహ్మణులతో వివాహాలు ఇటీవల పెద్ద ఎత్తున జరుగుతున్నాయని పెళ్లి కోసం ఎదురుచూస్తున్న అజయ్ అనే వ్యక్తి చెప్పారు. ఉత్తరాది బ్రాహ్మణులతో సైతం పెద్దలు కుదిర్చిన వివాహాలు జరుగుతుండడం చూస్తున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడంటే ఇవన్నీ జరిగేవి కావని, ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు. సంఘం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా