Manish Sisodia: సిసోదియాను లాక్కెళ్లిన పోలీసులు.. వీడియో బయటపెట్టిన ఆప్
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా (Manish Sisodia)పై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన వీడియో ఒకటి తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై ఆప్ నేతలు మండిపడుతున్నారు.
దిల్లీ: మద్యం కుంభకోణం (Excise Scam) కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా (Manish Sisodia)తో పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సహా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు ఆరోపించారు. ఈ మేరకు సిసోదియాను పోలీసులు లాక్కెళ్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆప్.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తింది. అసలేం జరిగిందంటే..
మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సిసోదియా (Manish Sisodia) కస్టడీ మంగళవారంతో ముగియడంతో దిల్లీ పోలీసులు ఆయన్ను నేడు కోర్టులో హాజరుపర్చారు. కోర్టు గది నుంచి సిసోదియాను బయటకు తీసుకొస్తుండగా మీడియా ఆయనను చుట్టుముట్టింది. దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డుకునేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ గురించి విలేకరులు సిసోదియాను అడగ్గా.. ‘‘మోదీజీ చాలా అహంకారిగా మారారు. ఆయనకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు’’ అని ఆప్ (AAP) నేత బదులిచ్చారు.
అయితే, సిసోదియాను ప్రశ్నిస్తుండగా ఓ పోలీసు అధికారి.. విలేకర్ల ఫోన్లను తోసేశారు. ఆ తర్వాత ఆప్ నేతపై మెడ చుట్టూ చేయి వేసి బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సోషల్మీడియాలో షేర్ చేశారు. ‘‘రౌస్ అవెన్యూ కోర్టులో సిసోదియా (Manish Sisodia)తో ఓ పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని’’ అని దిల్లీ మంత్రి అతిషి డిమాండ్ చేశారు. ఈ వీడియోపై కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందిస్తూ.. ‘‘మనీశ్జీతో ఇలా దురుసుగా ప్రవర్తించే అధికారం పోలీసులకు ఉందా? లేదంటే ఇలా చేయమని పోలీసులను ఎవరైనా ఆదేశిస్తున్నారా?’’ అంటూ కేంద్రంపై పరోక్షంగా మండిపడ్డారు.
అయితే ఈ ఆరోపణలను దిల్లీ పోలీసులు ఖండించారు. ‘‘ఆయనకు భద్రత కల్పించడంలో భాగంగానే పోలీసులు అలా ప్రవర్తించారు. అంతేగాక, నిందితులు మీడియాకు స్టేట్మెంట్లు ఇవ్వడం చట్టపరంగా వ్యతిరేకం’’ అని దిల్లీ పోలీస్ విభాగం ట్వీట్ చేసింది. కాగా.. మద్యం కుంభకోణం కేసులో సిసోదియా కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. జూన్ 1వ తేదీ వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండాలని స్పష్టం చేసింది. అయితే జైల్లో ఆయనకు కుర్చీ, టేబుల్, పుస్తకాలు అందించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
జైన్ ఫొటోపై దిగ్భ్రాంతి..
ఇక, మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటో ఒకటి బయటికొచ్చింది. అందులో జైన్ బలహీనంగా, బక్కచిక్కిపోయి కన్పించారు. ఈ ఫొటోను షేర్ చేసిన కేజ్రీవాల్.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘జైన్ త్వరగా కోలుకోవాలి. భాజపా అహంకారాన్ని, దౌర్జన్యాలను దిల్లీ ప్రజలంతా చూస్తున్నారు. ఈ అణచివేతదారులను దేవుడు కూడా క్షమించడు. ఈ పోరాటంలో మాకు ప్రజలు, భగవంతుడు అండగా ఉన్నారు. మేం భగత్సింగ్ అనుచరులం. అన్యాయం, నియంతృత్వంపై మా పోరాటం కొనసాగుతుంది’’ అని కేజ్రీవాల్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సత్యేందర్ జైన్ను జైల్లోనే చంపేసేందుకు భాజపా కుట్రలు పన్నుతోందని ఆప్ నేతలు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ