Good News: పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్!

పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పింఛను పొందేందుకు ఏటా బ్యాంకులు/పోస్టాఫీసులకు లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిన గడువును.....

Updated : 01 Dec 2021 19:44 IST

దిల్లీ: పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పింఛను పొందేందుకు ఏటా బ్యాంకులు/పోస్టాఫీసులకు లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిన గడువును పొడిగించింది. సాధారణంగా ఈ గడువు (నిన్న) నవంబర్‌ 30తో ముగిసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 31 వరకు పింఛనుదారులు తమ లైఫ్‌ సర్టిఫికెట్‌ను బ్యాంకులకు సమర్పించవచ్చని స్పష్టంచేసింది. పలు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతుండటం, వృద్ధులకు కొవిడ్‌ ముప్పు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

పెన్షనర్లు తాము జీవించే ఉన్నామని చెప్పేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి పెన్షన్‌ డిస్బర్సింగ్‌ అథారిటీలకు ఏటా లైఫ్‌ సర్టిఫికెట్‌ని సమర్పించాల్సి ఉంటుంది. ప్రతినెలా పెన్షన్‌ పొందేందుకు ఈ సర్టిఫికెట్‌ తప్పనిసరి. అయితే, దీన్ని నవంబర్‌ 30లోపు సమర్పించాల్సి ఉండగా.. కొవిడ్‌ ముప్పు వృద్ధులకు అధికంగా ఉన్న తరుణంలో బ్యాంకు శాఖల వద్ద రద్దీని తగ్గించే ఉద్దేశంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని