Delhi: ఒమిక్రాన్ బాధితులకు ఏం చికిత్సఅందిస్తున్నారంటే..?
ఒమిక్రాన్ బాధితులకు కేవలం మల్టీ విటమిన్లతో పాటు పారాసెటమాల్ మాత్రలను మాత్రమే అందిస్తున్నట్లు దిల్లీలోని లోక్నాయక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
దిల్లీ వైద్యుల వెల్లడి
దిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్ టెస్టులు నిర్వహించడంతో పాటు పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపిస్తున్నారు. ఒమిక్రాన్ నిర్ధారణ అయిన వెంటనే ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ బాధితులకు కేవలం మల్టీ విటమిన్లతో పాటు పారాసెటమాల్ మాత్రలను మాత్రమే అందిస్తున్నట్లు దిల్లీలోని లోక్నాయక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ఆస్పత్రిలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన 40 మంది బాధితులు చేరగా ఇప్పటికే 19 మంది డిశ్ఛార్జి అయినట్లు తెలిపారు. దిల్లీలో మొత్తంగా ఇప్పటివరకు 67 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా ఇప్పటికే 23 మంది కోలుకున్నారు.
‘ఆస్పత్రిలో చేరుతున్న ఒమిక్రాన్ బాధితుల్లో 90శాతం మందికి లక్షణాలు ఏమీ ఉండడం లేదు. కేవలం గొంతు నొప్పి, స్వల్ప జ్వరం, ఒళ్లునొప్పులు వంటివి మాత్రమే కనిపిస్తున్నాయి. లక్షణాలను బట్టి కేవలం వారికి మల్టీ విటమిన్, పారాసెటమాల్ మాత్రమే అందిస్తున్నాం. ప్రస్తుతానికి ఇంతకంటే ఇతర ఔషధాలు ఇచ్చే అవసరం లేదని భావిస్తున్నాం’ అని ఎల్ఎన్జేపీలోని సీనియర్ వైద్యులు వెల్లడించారు. అయితే, విదేశాల నుంచి ఒమిక్రాన్ నిర్ధారణ అయిన వారిలో ఇప్పటికే రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకోగా.. అందులో కొందరు మూడో డోసు కూడా తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఆఫ్రికాకు చెందిన ఓ ఎంపీతో పాటు భారత్కు చెందిన పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు ఉన్నట్లు ఎల్ఎన్జేపీ వైద్యులు పేర్కొన్నారు. ఇక దిల్లీలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తిని తెలుసుకునేందుకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చినవారందరి నమూనాలకు జీనోమ్ సీక్వెన్స్ చేపడుతున్నామని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. నగరంలో ఉన్న నిర్ధారణ కేంద్రాల సహాయంతో నిత్యం 300 నుంచి 400 నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నామన్నారు.
ఇదిలాఉంటే, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ డెల్టాతో పోలిస్తే వ్యాధి తీవ్రత తక్కువే ఉండవచ్చని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేరియంట్ వల్ల ఆస్పత్రి చేరికలు, మరణాల ముప్పు తక్కువేనని అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు చాలా దేశాల్లో నిర్ధారణ అవుతోన్న ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల్లో స్వల్ప లక్షణాలు కనిపిస్తుండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. అయినప్పటికీ ఒమిక్రాన్ కట్టడికి అన్ని రాష్ట్రాలు సన్నద్ధం అవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ