నటి బంగ్లాను కక్ష సాధించేందుకే కూల్చారు: కోర్టు
కార్యాలయం కూల్చివేత కేసులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విజయం సాధించింది. ఆమెకు అనుకూలంగా ముంబయి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ వ్యవహారంపై కోర్టు బీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది....
కంగనాకు అనుకూలంగా తీర్పు వెల్లడించిన ముంబయి కోర్టు
ముంబయి: కార్యాలయం కూల్చివేత కేసులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు అనుకూలంగా ముంబయి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ వ్యవహారంపై కోర్టు.. బీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కక్ష సాధించేందుకే ఆమె బంగ్లాను కూల్చివేశారంటూ పేర్కొంది. తన బంగ్లాను అక్రమంగా కూల్చి వేశారంటూ రెండు నెలల క్రితం కంగనా వేసిన పిటిషన్ను శుక్రవారం కోర్టు పరిశీలించింది. ‘కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను మేం సమర్థించడం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం. బాధ్యత లేని ఓ వ్యక్తి వ్యాఖ్యలను పట్టించుకోకపోవడమే ఉత్తమం. ఇందుకు ఆమెపై మీ బలాన్ని చూపించాల్సింది కాదు’ అని పేర్కొంది.
శివసేన పార్టీకి చెందిన పత్రిక సామ్నాలో ప్రచురితమైన వార్తలు, ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ చేసిన పలు వ్యాఖ్యల క్లిప్పింగులను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కంగనాపై బెదిరింపులకు పాల్పడ్డట్లు స్పష్టం చేసింది. ‘బీఎంసీది కక్ష్య సాధింపు చర్య. కంగనాను బెదిరించేందుకే ఆమె కార్యాలయాన్ని కూల్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని జస్టిస్ ఎస్జే కతావళ్ల, జస్టిస్ రియాజ్ చగ్లాతో కూడిన బెంచ్ పేర్కొంది. నటికి జరిగిన నష్టాన్ని బీఎంసీనే పూడ్చాలని తీర్పు వెల్లడించింది. కూల్చివేసిన భాగాన్ని పునర్నిర్మించేందుకు బీఎంసీకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా న్యాయస్థానం కంగనాకు సూచించింది. కూల్చివేయని ప్రాంతాన్ని క్రమబద్ధీకరించడానికి కూడా ఆమె దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
కోర్టు తీర్పుపై కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేసింది. దీన్ని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించింది. ‘ఓ వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి గెలిస్తే అది ఆ ఒక్క వ్యక్తి గెలుపు మాత్రమే కాదు.. అది ప్రజాస్వామ్య గెలుపు. ఈ కేసు వ్యవహారంలో నాకు మద్దతుగా నిలిచిన వారితోపాటు, నా కలలను చిదిమివేసినందుకు గాను నవ్వినవారికి కూడా నా ధన్యవాదాలు’ అంటూ తనదైన శైలిలో స్పందించింది. ఈసందర్భంగా బీఎంసీ ఫొటోతోపాటు, ఆమె ఫొటోను జోడిస్తూ మీరు విలన్గా మారితే నేను హీరోనయ్యాను అంటూ ట్వీట్ చేసింది.
నటుడు సుశాంత్సింగ్ కేసు దర్యాప్తు గురించి కంగనా మాట్లాడుతూ మూవీ మాఫియా కంటే ముంబయి పోలీసులంటేనే భయంగా ఉందని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు కాస్తా రాజకీయ దుమారం రేపాయి. దీంతో శివసేన నేత సంజయ్రౌత్కు, కంగనకు మధ్య కొన్నిరోజుల పాటు మాటల యుద్ధం సాగింది. ఈనేపథ్యంలోనే సెప్టెంబర్ 9వ తేదీన ముంబయి మహానగర పాలక సంస్థ (బీఎంసీ) బాంద్రాలోని కంగనా రనౌత్ కార్యాలయ కూల్చివేత ప్రారంభించింది. బంగ్లాలోని కొంత భాగాన్ని కూల్చివేసింది. దీంతో నటి ముంబయి కోర్టును ఆశ్రయించగా కూల్చివేతలు ఆపాలంటూ కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. తన కార్యాలయాన్ని అక్రమంగా కూల్చివేసినందుకుగానూ రూ.2 కోట్ల నష్టపరిహారాన్ని నటి డిమాండ్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సికందర్’ సరసన రష్మిక
త్వరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది అందాల తార రష్మిక. -
రామోజీ ఫిల్మ్ సిటీలో... కన్నప్ప సెట్లో
మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. -
అంధుడి పాత్రలో సైఫ్ అలీఖాన్?
పాత్ర బాగుంటే అది హీరోనా... విలనా అనేది చూడనంటారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. -
ప్రతినిధి 2 అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది
‘‘ప్రస్తుత భారతదేశ రాజకీయాల్ని ప్రతిబింబించే చిత్రం ‘ప్రతినిధి 2’. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకో మేలు చేసేలా ఉండదు. -
మళ్లీ జాలీగా వచ్చేసింది పుష్ప
బాలీవుడ్లో నవ్వులు పూయించిన చిత్రాలు ఎన్నో. అందులో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీ సినిమాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. -
మాయావన్లో పోరు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘మాయావన్’. -
మరో కొత్త కథతో నయన్ సిద్ధం!
గతేడాది ‘జవాన్’తో సినీప్రియుల్ని మెప్పించిన అగ్రకథానాయిక నయనతార.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. -
‘మాత్రు’.. ఓ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం
సుగి విజయ్, రూపాలి భూషణ్ జంటగా... జాన్ జక్కీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాత్రు’. -
భారతీయ పాటలకు లాస్ ఏంజెలిస్లో ఆస్కార్ గౌరవం
ఎన్నో ఏళ్లుగా కలగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ పురస్కారాన్ని అందుకొని.. భారతీయ సినిమా గొప్పతనాన్ని ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. -
మరోసారి వాయిదా
విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. -
భయ్యాజీ ప్రతీకారం
‘భయ్యాజీ’.. ఎంతో ప్రేమగా చూసుకునే తన తమ్ముడిని చంపిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ సోదరుడు చేస్తున్న పోరాటం ఆధారంగా రూపొందిన చిత్రమిది. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు