Nayantara: మరో కొత్త కథతో నయన్‌ సిద్ధం!

గతేడాది ‘జవాన్‌’తో సినీప్రియుల్ని మెప్పించిన అగ్రకథానాయిక నయనతార.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.

Updated : 10 May 2024 10:05 IST

తేడాది ‘జవాన్‌’తో సినీప్రియుల్ని మెప్పించిన అగ్రకథానాయిక నయనతార.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మన్నన్‌గట్టి సిన్స్‌ 1960’. డ్యూడ్‌ విక్కీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని ఫొటోల్ని పంచుకుంది నిర్మాణ సంస్థ. ‘‘విజయవంతంగా చిత్రీకరణ ముగిసింది. ఎన్నో మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలతో ఇప్పటికే తానెంటో నిరూపించుకున్న నయన్‌.. మరో కొత్త కథతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నామ’’ని వ్యాఖ్యల్ని జోడించింది. 1960 బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో మునుపెన్నడూ చూడని కథాంశాన్ని ఇందులో చూపించనున్నట్లు తెలిపింది చిత్రబృందం. లక్ష్మణ్‌ దీన్ని నిర్మిస్తున్నారు. యోగిబాబు, గౌరీ కిషన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘టెస్ట్‌’, ‘డియర్‌ స్టూడెంట్స్‌’ చిత్రీకరణలలో ఉంది నయన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని