Gang of godavari: మరోసారి వాయిదా

విష్వక్‌ సేన్‌ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.

Updated : 10 May 2024 10:08 IST

విష్వక్‌ సేన్‌ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇది వరకు ప్రకటించారు. కానీ, ఇప్పుడిది మరోసారి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ చిత్ర బృందం గురువారం కొత్త పోస్టర్‌ను పంచుకుంది. అంతేకాదు ఈ నెల 10న ఈ సినిమాలోని ‘‘బ్యాడ్‌’’ అనే గీతాన్ని బయటకు వదలనున్నట్లు స్పష్టత ఇచ్చింది. ‘‘ఇదొక భిన్నమైన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా. విష్వక్‌ ఇందులో లంకల రత్న అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. తను ఓ సామాన్యుడిగా చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టి అసామాన్యుడిగా ఎలా ఎదిగాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా కనిపించనుండగా.. అంజలి ముఖ్య పాత్రలో సందడి చేయనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని