రాష్ట్రాన్ని తాకట్టు పెట్టయినా నాన్న విగ్రహం పెట్టిస్తా

ఎస్తర్‌ అనిల్‌, ఈశ్వరీరావు, చైతన్య కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జోహార్‌’. తేజ మర్ని దర్శకుడు. ఈ వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీ బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో

Updated : 13 Aug 2020 16:08 IST

ఆసక్తికరంగా ‘జోహార్‌’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ఎస్తర్‌ అనిల్‌, ఈశ్వరీరావు, చైతన్య కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జోహార్‌’. తేజ మర్ని దర్శకుడు. ఈ వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీ బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో దీన్ని విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రాజకీయ నేపథ్యంలో సాగే కథ ఇది. పొలిటికల్‌ సెటైర్‌లా దీన్ని తీర్చిదిద్దారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. ఉత్కంఠగా, ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్‌ను మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని