ఈ ఏడాది కిక్ ఇచ్చిన క్లిక్స్ ఇవే..!
మోహన్బాబు-చిరంజీవి ప్రేమగా ఆలింగనం చేసుకుంటే.. మెగా ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే.. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కలిసి సందడి చేస్తే.. చదవడానికే ఎంతో ఆసక్తిగా ఉంది కదా.. మరి అలాంటి మధురమైన జ్ఞాపకాలెన్నో ఫొటోల రూపంలో...
కోట్లాదిమంది మది దోచిన ఫొటోలు చూశారా
ఇంటర్నెట్డెస్క్: మోహన్బాబు-చిరంజీవి ప్రేమగా ఆలింగనం చేసుకుంటే.. మెగా ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే.. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కలిసి సందడి చేస్తే.. చదవడానికే ఎంతో ఆసక్తిగా ఉంది కదా.. మరి అలాంటి మధురమైన జ్ఞాపకాలెన్నో ఫొటోల రూపంలో ఈ ఏడాది ప్రతిఒక్కర్నీ ఆకర్షించాయి. ఏడాది ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ దక్షిణాది సినీ తారలకు సంబంధించిన ఎన్నో చిత్రాలు నెట్టింట్లో వైరల్గా మారి.. కోట్లలో లైక్స్.. లక్షల్లో కామెంట్లు సొంతం చేసుకున్నాయి. సినీ ప్రియులకు కిక్ ఇచ్చిన అలాంటి కొన్ని క్లిక్స్పై ఓ లుక్కేద్దాం..
ప్రేమతో.. చిరంజీవి-మోహన్బాబు
కొత్త సంవత్సర వేడుకల్ని మరింత రెట్టింపు చేస్తూ ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా మోహన్బాబును చిరంజీవి ప్రేమగా ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టుకున్నారు. ‘పిక్ ఆఫ్ ది ఇయర్’గా ఈ ఫొటో కోట్లలో లైక్స్ సొంతం చేసుకుంది.
హీరో-విలన్ కలిస్తే
విజయ్ కథానాయకుడిగా విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్’. లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో పూర్తయ్యింది. ఆఖరి షెడ్యూల్ షూట్ పూర్తైన సందర్భంగా విజయ్ సేతుపతి.. హీరో విజయ్ని ఆత్మీయంగా ముద్దుపెట్టుకున్నారు. ఈ ఫొటో ఎంతోమందిని మెప్పించింది.
కుటుంబం ఇది దగ్గుబాటి కుటుంబం
టాలీవుడ్లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరుపొందిన నటుల్లో ఒకరైన రానా ఈ ఏడాదిలోనే ప్రేమ.. పెళ్లితో అందరికీ షాక్ ఇచ్చాడు. తన ప్రేయసి మిహీకా బజాజ్ మెడలో ఆగస్ట్ 9న మూడుముళ్లు వేశారు. వీరి వివాహ వేడుకల్లోని కొన్ని ఫొటోలు అందర్ని ఆకర్షించాయి. రామానాయుడు స్టూడియోస్లో జరిగిన ఈ పెళ్లితంతుకి సంబంధించి దగ్గుబాటి ఫ్యామిలీ పిక్ ఆకట్టుకుంది.
కన్నీరు తెప్పించారు..
కన్నడ నటుడు చిరుసర్జా ఈ ఏడాది జూన్ నెలలో గుండెపోటుతో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. చిరు సర్జా సతీమణి నటి మేఘనా రాజ్ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన అన్న కుమారుడ్ని చేతిలోకి తీసుకుని మురిసిపోయిన ధ్రువ్ సర్జా... ఆ బాబుని కొంతసమయంపాటు చిరు సర్జా ఫొటో వద్ద ఉంచారు. అప్పట్లో ఈ ఫొటో అందర్నీ భావోద్వేగానికి గురి చేసింది.
‘ఆర్ఆర్ఆర్’ మెరుపులు
సినీ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఈ ఏడాది దీపావళి కానుకగా కొన్ని స్పెషల్ ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రతి పండగకి ఏదో ఒక పోస్టర్తో శుభాకాంక్షలు తెలిపే ఈ టీమ్.. దీపావళికి మాత్రం కొంచెం విభిన్నంగానే ఆకట్టుకుంది. రాజమౌళి-ఎన్టీఆర్-రామ్చరణ్లతో ఓ స్పెషల్ ఫొటోషూట్ నిర్వహించి.. ఆ ఫొటోల్ని పండగ సందర్భంగా అభిమానులతో పంచుకుంది.
మెగాఫ్యామిలీ.. ఆ కిక్కే వేరప్పా
నాగబాబు కుమార్తె నిహారిక-చైతన్య జొన్నలగడ్డల వివాహం ఇటీవల ఉదయ్పుర్లో వేడుకగా జరిగింది. ఎన్నో అపురూప క్షణాలకు ఈ పెళ్లి వేడుకైంది. ముఖ్యంగా పవన్కల్యాణ్ రాకతో ఈ వేడుకల్లో మరింత జోష్ నెలకొంది. మెగా, అల్లు కుటుంబసభ్యులందరితో అకీరా దిగిన ఓ ఫొటో సినీ ప్రియులకు ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. అదే వేడుకలో చిరు.. తన తమ్ముడు కుమార్తె ఆద్యాను ప్రేమగా దగ్గరకు తీసుకుని.. ఫొటోలకు పోజులిచ్చారు. ఇవీ కూడా హైలెట్ అనే చెప్పాలి.
స్టార్స్ కలిస్తే..
తెలుగు చిత్రపరిశ్రమలో పేరుపొందిన హీరోలందరూ ఒకేచోట కలిస్తే.. చూడడానికి రెండు కళ్లు సరిపోవని ఇటీవల రుజువైంది. ప్రముఖ నిర్మాత దిల్రాజు బర్త్డే పార్టీలో అగ్ర, యువ తారలందరూ సందడి చేశారు. పార్టీలో భాగంగా మహేశ్బాబు, ప్రభాస్, రామ్ చరణ్, రామ్, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య కలిసి దిగిన ఓ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇవి మాత్రమే కాకుండా కాజల్ పెళ్లి, ‘వకీల్సాబ్’ షూటింగ్, అభిమానులతో ప్రభాస్, రజనీకాంత్ కారు డ్రైవింగ్.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో మరెన్నో ఫొటోలు ప్రతిఒక్కరికీ మర్చిపోలేని కిక్ను అందించాయి.
ఇదీ చదవండి
ఓటీటీలో మెరిసిన అగ్ర తార ఎవరు?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి