సిద్ద్‌ ఈజ్‌ బ్యాక్‌..!

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..!’, ‘బొమ్మరిల్లు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు నటుడు సిద్దార్థ్‌. చాలా కాలం విరామం తర్వాత ఆయన మరోసారి తెలుగు అభిమానులను  పలకరించేందుకు సిద్ధమయ్యారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో దర్శకుడిగా విజయాన్ని...

Published : 18 Sep 2020 13:05 IST

స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన ‘మహాసముద్రం’ టీం

హైదరాబాద్‌: ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..!’, ‘బొమ్మరిల్లు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు నటుడు సిద్దార్థ్‌. చాలా కాలం విరామం తర్వాత ఆయన మరోసారి తెలుగు అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో దర్శకుడిగా విజయాన్ని సొంతం చేసుకున్న అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘మహాసముద్రం’ సినిమాలో సిద్దార్థ్‌ ఓ కీలకపాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ శుక్రవారం ఉదయం ఓ స్పెషల్‌ పోస్ట్‌ పెట్టింది. ‘సముద్రమంత టాలెంట్‌ కలిగి, మరొక్కసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న సిద్దార్థ్‌కు.. ‘మహాసముద్రం’ టీం స్వాగతం పలుకుతోంది’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.

శర్వానంద్‌ కథానాయకుడిగా రానున్న ‘మహాసముద్రం’ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. విభిన్న కథా చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో శర్వానంద్‌ సరసన ఎవరు కనిపించనున్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మొదట సమంతతోపాటు మరికొంతమంది కథానాయికల పేర్లు వినిపించినప్పటికీ తాజాగా ఐశ్వర్య రాజేశ్‌ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని