ఆ రోజులు గుర్తొచ్చాయి
‘‘జీవితం అంటే ఏంటి? మన కలలను సాకారం చేసుకునేందుకు ఏం చేయాలి? లక్ష్యాలను సాధించేందుకు ఎంతలా కష్టపడాలి? అన్నదే ‘ఇదే మా కథ’లోని సందేశం’’ అన్నారు నటుడు శ్రీకాంత్. ఆయన సుమంత్ అశ్విన్, తాన్య హోప్, భూమికలతో కలిసి నటించిన చిత్రమిది. గురు పవన్ దర్శకుడు. మహేష్ గొల్లా నిర్మాత. ఈ సినిమా ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది...
‘‘జీవితం అంటే ఏంటి? మన కలలను సాకారం చేసుకునేందుకు ఏం చేయాలి? లక్ష్యాలను సాధించేందుకు ఎంతలా కష్టపడాలి? అన్నదే ‘ఇదే మా కథ’లోని సందేశం’’ అన్నారు నటుడు శ్రీకాంత్. ఆయన సుమంత్ అశ్విన్, తాన్య హోప్, భూమికలతో కలిసి నటించిన చిత్రమిది. గురు పవన్ దర్శకుడు. మహేష్ గొల్లా నిర్మాత. ఈ సినిమా ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ గురువారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘దర్శకుడు గురు ఓ రోజు వచ్చి నాకీ కథ చెప్పాడు. ఇందులో ఆయన నిజ జీవితంలో చూసిన కొన్ని సంఘటనలూ ఉన్నాయి. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన నలుగురు బైక్ ట్రావెలర్స్ కలిసి.. హైదరాబాద్ నుంచి లద్దాఖ్ వరకు చేసే ప్రయాణమే ఈ కథాంశం. ఇలా సుదీర్ఘ రోడ్డు ప్రయాణ నేపథ్యమే నన్ను చాలా ఆకర్షించింది. నేనిందులో మహేంద్ర అనే పాత్రలో కనిపిస్తా. 24ఏళ్ల క్రితం మిస్ అయిన ప్రేమించిన అమ్మాయిని కలుసుకునేందుకు బైక్పై లద్దాఖ్కు బయల్దేరుతా. నేనలా వెళ్లడానికి వెనక మరో ఆసక్తికరమైన కారణమూ ఉంటుంది. అదేంటన్నది తెరపైనే చూడాలి’’.
అదే సవాల్గా అనిపించింది...
‘‘భూమిక ఓ గృహిణిగా.. ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తుంది. సుమంత్ అశ్విన్ బైక్ రేసింగ్లంటే ఇష్టపడే కుర్రాడిగా కనిపిస్తాడు. తనకీ ఓ లక్ష్యం ఉంటుంది. దానికోసమే బయల్దేరుతాడు. ఇలా విభిన్న లక్ష్యాలతో మొదలైన మా ప్రయాణాలు ఎలా కలిశాయి? ఆ తర్వాత మాతో తాన్య ఎందుకు కలిసింది? అందరం కలిసి మా లక్ష్యాలను ఎలా చేరుకున్నామన్నది ఆసక్తికరంగా ఉంటుంది’’.
అది రోషన్ అదృష్టం..
‘‘రాఘవేంద్రరావు చేతుల మీదుగా ‘పెళ్లి సందడి’ చిత్రంతో నా తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా ఎంతో మంది పెద్ద హీరోలు పరిచయమయ్యారు. ఇప్పుడా అవకాశం రోషన్కు రావడం వాడి అదృష్టం. ఇప్పుడొస్తున్న జానర్లకంటే కొత్తగా ఉంటుందీ చిత్రం. పెళ్లిలో ఉండే గోల, ఆ సందడి, అన్నీ ఉంటాయి. ‘ఎఫ్2’ ఎంత ఫ్రెష్గా అనిపించిందో.. ‘పెళ్లి సందడి’ అంతేఫ్రెష్గా ఉంటుంది’’.
‘అఖండ’లో ఇలా...
‘‘ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ’, రామ్చరణ్, శంకర్ కలయికలో వస్తోన్న చిత్రంలో విలన్గా నటిస్తున్నా. ‘అఖండ’లో నా లుక్ కోసం బోయపాటి ముంబయి నుంచి ప్రత్యేకంగా డిజైనర్లను తీసుకొచ్చారు. అత్యంత క్రూరంగా కనిపిస్తా. ఆ లుక్ చూసుకున్నాక.. మహిళా ప్రేక్షకులు నన్ను తిడతారేమో అనుకునేవాణ్ని. చిత్ర బృందం నా లుక్ను ఎప్పుడు విడుదల చేస్తుందనేది నాకూ తెలియదు. నిజానికి ఈ సినిమాలో విలన్గా చేయడానికి ముందు చాలా ఆలోచించా. ఎందుకంటే ‘శ్రీరామరాజ్యం’లో లక్ష్మణుడిగా బాలకృష్ణ పక్కన చేశాను. ఇప్పుడాయన పక్కన ఇంత క్రూరమైన పాత్రలో కనిపిస్తే బాగుంటుందా? అనుకున్నా. ఇదే విషయాన్ని బాలయ్య బాబుతో చెప్తే.. ‘ఇలాంటి పాత్రలే చెయ్యాలి’ అన్నారు. దీని తర్వాత చాలా పాత్రలొస్తాయి.. ఏది పడితే అది చేయకని సలహా ఇచ్చారు’’.
మద్రాస్ నుంచి హైదరాబాద్కు బైక్పైనే..
‘‘నేను బైక్ రైడింగ్లను చాలా ఇష్టపడతా. చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో ఎక్కువగా బైక్ పైనే తిరుగుతుండే వాణ్ని. షూటింగ్ల కోసం మద్రాస్ నుంచి హైదరాబాద్కు బైక్పై వచ్చిన రోజులూ ఉన్నాయి. ఇక బాధ్యతలు పెరుగుతున్న సమయంలో నా భద్రతను దృష్టిలో పెట్టుకుని బండి వాడకాన్ని తగ్గించేశా. అయితే ఈ సినిమాతో మళ్లీ ఇలా బైక్ రైడింగ్ చేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. పాత రోజులన్నీ కళ్ల ముందు మెదిలాయి.
దర్శకుడు కొత్త వాడైనా.. మంచి అనుభవజ్ఞుడిలా సినిమా తెరకెక్కించాడు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు