NTRతో మాట్లాడిన చిరంజీవి

ఇటీవల కరోనా బారినపడిన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో మెగాస్టార్‌ చిరంజీవి ఫోన్‌లో మాట్లాడారు. తారక్‌ ఆరోగ్యం గురించి క్షేమసమాచారాలు చిరు అడిగి

Published : 12 May 2021 14:16 IST

ఏం అన్నారంటే

హైదరాబాద్‌: ఇటీవల కరోనా బారినపడిన సినీ నటుడు ఎన్టీఆర్‌తో మెగాస్టార్‌ చిరంజీవి ఫోన్‌లో మాట్లాడారు. తారక్‌ ఆరోగ్యం గురించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని చిరునే స్వయంగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘కాసేపటి క్రితం తారక్‌తో ఫోన్‌లో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు. తారక్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు సైతం ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. తారక్‌ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలుసుకుని నాకెంతో ఆనందంగా అనిపించింది. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను’ -ట్విటర్‌లో చిరు

భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కొమురంభీమ్‌గా తారక్‌ నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కించనున్నారు. మరోవైపు సినీ నటులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, కంగనా రనౌత్‌, శిల్పాశెట్టి కుటుంబం సహా పలువురు తారలు తాము కరోనా బారినపడినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. పవన్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, తాజాగా అల్లు అర్జున్‌ సైతం కొవిడ్‌ నుంచి కోలుకున్నట్లు బుధవారం ఉదయం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని