Tiger NageswaraRao: ‘టైగర్‌..’లో మరో నాయిక

రవితేజ కథానాయకుడిగా వంశీ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాత. ఈ   సినిమాతో కృతి సనన్‌ సోదరి నూపుర్‌ సనన్‌ కథానాయికగా వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రంతోనే మరో కొత్త నాయిక చిత్రసీమకు పరిచయం కానుంది.

Updated : 02 Apr 2022 13:55 IST

వితేజ కథానాయకుడిగా వంశీ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాత. ఈ సినిమాతో కృతి సనన్‌ సోదరి నూపుర్‌ సనన్‌ కథానాయికగా వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రంతోనే మరో కొత్త నాయిక చిత్రసీమకు పరిచయం కానుంది. ఆమే ప్రముఖ మోడల్‌, నటి గాయత్రీ భరద్వాజ్‌. ఈ సినిమాలో ఆమె మరో కథానాయికగా సందడి చేయనుంది. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఎంతో పేరుమోసిన స్టూవర్టుపురం నాగేశ్వరరావు జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇద్దరు కథానాయికలకు మంచి ప్రాధాన్యం ఉంది.’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12.06 గంటలకు ప్రీలుక్‌ను విడుదల చేయనున్నారు. సంగీతం: జీవి ప్రకాష్‌, మాటలు: శ్రీకాంత్‌ విస్సా, ఛాయాగ్రహణం: ఆర్‌ మదీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని