చిరు.. నువ్వు మన బిడ్డగా ఈ భూమ్మీదకు రావాలి!
కన్నడ నటుడు చిరంజీవి సర్జా మృతితో ఆయన కుటుంబంతో పాటు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవిని తలుచుకుంటూ
చిరంజీవి సర్జా సతీమణి మేఘనా రాజ్ భావోద్వేగ పోస్ట్
ఇంటర్నెట్డెస్క్: కన్నడ నటుడు చిరంజీవి సర్జా మృతితో ఆయన కుటుంబంతో పాటు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయనను తలుచుకుంటూ ఆయన భార్య మేఘనారాజ్ కుమిలిపోతున్నారు. ప్రస్తుతం మేఘన గర్భవతి. తాను తండ్రి కాబోతున్నానని తెలిసిన వెంటనే చిరు ఎంతో సంతోషించారు. త్వరలోనే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవాలని అనుకుంటున్న తరుణంలోనే విధి వీరి బంధాన్ని విడదీసింది. ఈ సందర్భంగా మేఘనా రాజ్ ఓ భావోద్వేగ పోస్ట్ను పంచుకున్నారు.
‘‘చిరు.. నీతో ఓ విషయం పంచుకోవడానికి పదే పదే ప్రయత్నించినా దాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. నీవు నాకు ఏమవుతావో చెప్పడానికి ఈ ప్రపంచంలో ఉన్న ఏ పదాలతో అది వర్ణించడం సాధ్యం కాదు. మై ఫ్రెండ్, మై లవర్, మై పార్టనర్, మై చైల్డ్, మై కాన్ఫిడెంట్, మై హజ్బెండ్ వీటన్నింటి కన్నా నువ్వు నాకు చాలా ఎక్కువ. నువ్వు నా ఆత్మలో ఒక భాగానివి’’
‘‘తలుపువైపు చూసిన ప్రతిసారీ ‘నేను ఇంటికొచ్చేశా ’ అంటూ నువ్వు కేకలు పెడుతూ రాకపోవడాన్ని చూసి ఒక లోతైన బాధ నా గుండెల్ని గుచ్చేస్తోంది. ప్రతి రోజూ, ప్రతి నిమిషం నీవు లేవన్న భావన నా హృదయాన్ని ముంచేస్తోంది. వెయ్యి సార్లు మరణించినంత బాధగా ఉంది. నేను నీరసించి పోయిన ప్రతి సారీ నన్ను రక్షించే దేవుడిలా నా చుట్టూ నువ్వు ఉన్న భావన కలుగుతోంది.’’
‘‘నువ్వు నాపై ఎంతో ప్రేమను చూపించావు. అందుకు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లలేదు. అవునా? నువ్వు నాకు ఇచ్చిన అద్భుతమైన బహుమతి మన చిన్నారి. మన ప్రేమకు చిహ్నం. ఈ తీయనైన అద్భుతాన్ని నాకు ఇచ్చినందుకు జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నిన్ను మన బిడ్డగా ఈ భూమ్మీద చూడటానికి వేచి ఉండటం నా వల్ల కావటం లేదు. నిన్ను తాకడానికి, నీ చిరు నవ్వు చూడటానికి వేచి చూడాల్సి రావడం నాకు సాధ్యం కావటం లేదు. నేను నీకోసం.. నువ్వు నాకోసం ఎదురు చూస్తున్నాం. నా తుది శ్వాస వరకూ నాలో నువ్వు బతికే ఉంటావు. ఐ లవ్యూ’’ అని రాసుకొచ్చారు.
2018 మే 2న చిరంజీవి సర్జా, నటి మేఘనా రాజ్ను వివాహం చేసుకున్నారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం తమ పెళ్లి జరిగిందని, రెండేళ్లు పూర్తయిందని 2020 మే 2న మేఘనా రాజ్ ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.