Chiranjeevi: ఆ ప్రేమని గోపీచంద్ కొనసాగిస్తున్నారు
‘‘గోపీచంద్ తండ్రి టి.కృష్ణ నాకు కాలేజీలో సీనియర్. ఆయన ఎప్పుడూ నాకు హీరోలా కనిపించేవారు. అద్భుతమైన దర్శకులు. సినిమాపై ఆయనకున్న ప్రేమని గోపీచంద్ కొనసాగిస్తున్నార’’న్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన ఆదివారం హైదరాబాద్లో
‘‘గోపీచంద్ తండ్రి టి.కృష్ణ నాకు కాలేజీలో సీనియర్. ఆయన ఎప్పుడూ నాకు హీరోలా కనిపించేవారు. అద్భుతమైన దర్శకులు. సినిమాపై ఆయనకున్న ప్రేమని గోపీచంద్ కొనసాగిస్తున్నార’’న్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘పక్కా కమర్షియల్’ ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటించిన చిత్రమిది. మారుతి దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులు. జులై 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకని ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల చప్పట్లే మాకు ఉత్సాహాన్నిస్తాయి. థియేటర్లో ఈ సినిమా ఎలా ఆడుతుందో, ఎలాంటి స్పందన వస్తుందో ఈ వేడుకే చెబుతోంది. అరవింద్ ఫోన్ చేసి గోపీచంద్, మారుతి ‘మిమ్మల్ని రమ్మంటున్నారు’ అని అడగ్గానే నేనెక్కువ సమయం తీసుకోలేదు. గోపీ విలక్షణమైన పాత్రలు చేస్తూ ఎదుగుతున్నాడు. ‘పక్కా కమర్షియల్’తో మరో స్థానానికి వెళతాడు. దర్శకుడు మారుతిలో ప్రతిభని ఆరంభంలోనే గమనించా. నీలో దర్శకుడున్నాడని నేను చెప్పిన మాట గుర్తు పెట్టుకుని తనదైన శైలిలో ప్రయత్నాలు చేసి ఎదిగాడు. తెలుగు ప్రేక్షకుల నాడి తెలిసినవాడు. యు.వి.క్రియేషన్స్కి చెందిన విక్కీ, వంశీ వచ్చి మారుతి దర్శకత్వంలో మీతో సినిమా చేయాలనుందని అడిగారు. ఆ సినిమాకి ఈ వేదికపైనే అంగీకరం చెబుతున్నా. ‘తొలిప్రేమ’, ‘ప్రతి రోజూ పండగే’ సినిమాల్లో రాశి చాలా బాగా నటించింది. రావు రమేష్ తన తండ్రి రావు గోపాలరావు స్ఫూర్తితో గొప్ప పాత్రలు చేస్తున్నారు. ఆయన స్థానాన్ని తప్పకుండా భర్తీ చేస్తారు. ఒక మంచి బృందం కలిసి చేసిన ఈ సినిమాతో థియేటర్లు కళకళలాడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ ‘‘నేను చిత్ర పరిశ్రమకొచ్చి ఇన్నేళ్లైనా చిరంజీవి నా వేడుకకి రాలేదు. మేమంతా వెళ్లి అడగ్గానే వస్తానని చెప్పారు. ఏ నేపథ్యం లేకపోయినా పట్టుదలతో వచ్చి పరిశ్రమకి ఓ మహావృక్షంలా నిలబడ్డారు. ఈ సినిమా నేను చేయడానికి కారణం నా స్నేహితుడు వంశీ. మారుతిలోని ప్రతిభకి చాలా పెద్ద స్థాయికి వెళతాడు. రాశిఖన్నాకి ఇంతకుముందు నాతో కలిసి చేసిన సినిమాల్లో సరైన పాత్రలు పడలేదు. ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది’’ అన్నారు.
* అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘ఇన్నేళ్ల తర్వాత నా సంస్థలో గోపీచంద్తో ఓ మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. మారుతి సన్నివేశం నుంచి బయటికెళ్లి వినోదం పండిస్తుంటారు. తను సినిమా గ్రామర్ తెలిసిన వ్యక్తి’’ అన్నారు.
* రాశిఖన్నా మాట్లాడుతూ ‘‘నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా ఇది. ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఇది అత్యుత్తతమైనద’’న్నారు. ఈ కార్యక్రమంలో బన్నీ వాస్, దిల్రాజు, రావు రమేష్, వంశీ, విక్కీ, సియాగౌతమ్, సప్తగిరి, శ్రీనివాస్రెడ్డి, వైవాహర్ష, సప్తగిరి, ప్రవీణ్, పవన్ సాదినేని, పవన్, కౌశిక్, సుబ్బు, అజయ్ ఘోష్, జానీ, వివేక్ కూచిభొట్ల, కృష్ణకాంత్, ఎస్.కె.ఎన్ తదితరులు పాల్గొన్నారు.
* మారుతి మాట్లాడుతూ ‘‘భావోద్వేగంతో కూడిన రోజు ఇది. బందరులో చిరంజీవి బొమ్మలేసుకుంటూ బ్యానర్లు రాసుకునే ఓ ఆర్టిస్ట్ని నేను.నా సినిమా వేడుకకి చిరంజీవి వచ్చారంటే అది సాధారణ విషయం కాదు. ఎవరైనా గట్టిగా అనుకుంటే సాధించగలరని అందరికీ చెబుతాను. ‘పక్కా కమర్షియల్’ సినిమాని చాలా బాగా తీశాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.