Tollywood: ఆయీయే.. ఆయీయే
తెలుగు చిత్రసీమ ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ ఓ వెలుగు వెలుగుతోంది. మన కథలు అందరికీ నచ్చుతున్నాయి. ప్రాంతీయ.. భాషా సరిహద్దులు చెరిపేస్తూ ప్రతి ఒక్కరి మనసుల్ని హత్తుకుంటున్నాయి. పసందైన వినోదాల్ని పంచిస్తున్నాయి.
తెలుగు దర్శకులను హిందీ.. పిలిచింది
తెలుగు చిత్రసీమ ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ ఓ వెలుగు వెలుగుతోంది. మన కథలు అందరికీ నచ్చుతున్నాయి. ప్రాంతీయ.. భాషా సరిహద్దులు చెరిపేస్తూ ప్రతి ఒక్కరి మనసుల్ని హత్తుకుంటున్నాయి. పసందైన వినోదాల్ని పంచిస్తున్నాయి. అందుకే మన దర్శకులు తయారు చేస్తున్న కథలపై బాలీవుడ్ స్టార్లు, నిర్మాతలు మనసుపడుతున్నారు. వారితో కలిసి సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్కు వరుస కడుతున్న తెలుగు దర్శకుల జాబితా అంతకంతకు రెట్టింపవుతోంది.
పాన్ ఇండియా సంస్కృతి వల్ల సినీ పరిశ్రమల ముఖ చిత్రమే మారిపోయింది. దర్శకుల్నైనా.. హీరోలనైనా ఇదివరకటిలా ఒక భాషకే పరిమితం చేసి చూసే రోజులు పోయాయి. ప్రతిభ ఉందని తెలిస్తే చాలు.. అన్ని చిత్రసీమలు ఎర్రతివాచీ పరచి అవకాశాలతో స్వాగతం పలుకుతున్నాయి. ఫలితంగానే ఎవరూ ఊహించని కొత్త కలయికలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ తరహా కలయికల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. వీటిలో తెలుగు దర్శకుల నుంచి రానున్న చిత్రాలే అరడజనుకు పైగా ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకొని చిత్రసీమ దృష్టిని ఆకర్షించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇదే సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి.. అక్కడా అదే రీతిలో విజయ ఢంకా మోగించారు. ఇప్పుడాయన హిందీలో రెండో సినిమాగా ‘యానిమల్’ను పట్టాలెక్కించారు. రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. వినూత్నమైన యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో రణ్బీర్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన లుక్, క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం.. హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ వచ్చే ఏడాది విడుదల కానుంది.
హను.. హిందీలో తొలి అడుగు
ప్రేమకథల్ని తెర కెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడిది అందెవేసిన చెయ్యి. ‘అందాల రాక్షసి’ నుంచి ‘సీతారామం’ వరకు ఆయన నుంచి వచ్చిన ప్రతి ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేసింది. ఇప్పుడాయన బాలీవుడ్లో తొలి అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా వెల్లడించారు. తన శైలికి భిన్నమైన సరికొత్త యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని, ఇందులో సన్నీ డియోల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటిస్తారని తెలిపారు. ఇది త్వరలో పట్టాలెక్కనుంది. దీంతో పాటు హను.. అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్సిరీస్ను తెరకెక్కించనున్నారు.
తేజ.. ‘జఖ్మీ’
యువతరం మెచ్చే కొత్తదనం నిండిన ప్రేమకథలకు చిరునామా దర్శకుడు తేజ. ప్రస్తుతం ఆయన దగ్గుబాటి అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే ఆయన బాలీవుడ్లో రెండు ప్రాజెక్ట్లు చేయనున్నారు. ఇందులో ఒకటి ‘జఖ్మీ’ అనే సినిమా కాగా.. మరొకటి ‘తస్కరి’ అనే వెబ్సిరీస్. వీటిని టైమ్స్ ఫిల్మ్స్, ఎన్.హెచ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ‘జఖ్మీ’ కశ్మీర్ నేపథ్యంలో సాగే చిత్రమని, ఇందులో ఇద్దరు కథానాయకులు నటిస్తారని ఇప్పటికే ప్రకటించారు. త్వరలో ఇది సెట్స్పైకి వెళ్లనుంది.
హిరాణీ నిర్మాణంలో అజయ్ భూపతి
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తొలి అడుగులోనే యువతరం దృష్టిని ఆకర్షించారు దర్శకుడు అజయ్ భూపతి. రెండో ప్రయత్నంగా ‘మహాసముద్రం’ తెరకెక్కించగా.. అది బాక్సాఫీస్ ముందు చేదు ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడాయన హిందీలో తొలి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్కుమార్ హిరాణి నిర్మించనున్నట్లు సమాచారం. దీనికి ఆయనే స్వయంగా కథ అందించనున్నారని, ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని ప్రచారం వినిపిస్తోంది. హిరాణి ప్రస్తుతం షారుఖ్ ఖాన్తో ‘డంకీ’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు.
వినాయక్.. ‘ఛత్రపతి’
ప్రభాస్ - రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమా ‘ఛత్రపతి’ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఇద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా. నుష్రత్ బరుచా కథానాయిక. తెలుగు వెర్షన్కు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ హిందీ చిత్రానికీ స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా.. త్వరలో విడుదల కానుంది.
సంకల్ప్.. ‘ఐబీ71’
‘ఘాజి’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఇప్పుడాయన ‘ఐబీ71’తో బాలీవుడ్లో తొలి అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. విద్యుత్ జమ్వాల్ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్న చిత్రమిది. విభిన్నమైన యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.