Balakrishna: ప్రేక్షకులకు నచ్చనిది బలవంతంగా రుద్దను
‘‘మనిషి తన దైనందిన జీవితంలో అన్నవస్త్రాలతో పాటు వినోదాన్నీ ఓ సాధనంగా ఎంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఎలాంటి సినిమాలు అందించాలి అన్నది పరిశ్రమ పెద్దలు ఆలోచించాలి’’ అన్నారు కథానాయకుడు బాలకృష్ణ.
బాలకృష్ణ
‘‘మనిషి తన దైనందిన జీవితంలో అన్నవస్త్రాలతో పాటు వినోదాన్నీ ఓ సాధనంగా ఎంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఎలాంటి సినిమాలు అందించాలి అన్నది పరిశ్రమ పెద్దలు ఆలోచించాలి’’ అన్నారు కథానాయకుడు బాలకృష్ణ. ఆయన ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర విడుదల ముందస్తు వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రమిది. రాకేష్ శశి తెరకెక్కించారు. ధీరజ్ మొగిలినేని, విజయ్.ఎమ్ సంయుక్తంగా నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకులు. నవంబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ బాగుంది. సినిమా కలర్ఫుల్గా కనిపిస్తోంది. నాకూ ఇలాంటి చిత్రాల్లో నటించాలని ఉంటుంది. కాకపోతే నా పరిమితులు నాకున్నాయి. నా అభిమానులు, ప్రేక్షకులకు నచ్చనిది వాళ్లపై బలవంతంగా రుద్దాలని అనుకోను. ఈ సినిమా విజయవంతమవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘మా నాన్నతో రెండు సినిమాలు చేశా. ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’. రెండూ పెద్ద హిట్టయ్యాయి. ఈ మూడో చిత్రమూ అదే తరహాలో విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఇందులో అను ఇమ్మాన్యుయేల్లోని నటిని అందరూ చూస్తారు. దర్శకుడు రాకేష్ పైకి నెమ్మదిస్తుడిలా కనిపిస్తాడు కానీ, పెద్ద పని రాక్షసుడు’’ అన్నారు హీరో అల్లు శిరీష్. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం యువతరం ఎదుర్కొంటున్న ఓ సమస్య ఆధారంగా రాసుకున్న కథతో తెరకెక్కించిన చిత్రమిది. మంచి వినోదం ఉంది. రాకేష్ చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘దర్శకుడు రాకేష్ ఈ కథతో నన్ను కలిసినప్పుడే నిర్ణయించుకున్నా.. ఈ చిత్రం నేను కచ్చితంగా చేయాలని. తనకీ కథపై ఉన్న నమ్మకం అలాంటిది. ఇది చాలా మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్. అందరూ థియేటర్లలో చూసి ఆనందించండి’’ అంది అను ఇమ్మాన్యుయేల్. ‘‘అల్లు శిరీష్కి నాకు కొన్నేళ్లుగా మంచి అనుబంధం ఉంది. ఈ చిత్రానికి ముందుకు మేము కొన్ని కథలు అనుకున్నా కుదర్లేదు. ఇన్నేళ్లకు ఈ చిత్రంతో అది సాధ్యమైంది. ఇది మా కాంబినేషన్లో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని నమ్ముతున్నా. ఈ చిత్రం కోసం శిరీష్ తనని తాను ఎంతగా మార్చుకున్నాడన్నది టీజర్, ట్రైలర్స్ చూస్తేనే అర్థమవుతుంది. అను ఇమ్మాన్యుయేల్ల వల్లే ఈ సినిమా చాలా సాఫీగా సాగిపోయింది’’ అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో మారుతి, వెంకటేష్ మహా, పరశురామ్, చందూ మొండేటి, వశిష్ఠ, సునీల్, తన్వీర్, అచ్చు రాజమణి, సాయి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.