Prathinidhi 2: నిజం చెప్పే హీరోలకు సలాం కొట్టు!

‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నారా రోహిత్‌. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మూర్తి దేవగుప్తపు తెరకెక్కించారు

Updated : 17 Apr 2024 12:10 IST

‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నారా రోహిత్‌. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మూర్తి దేవగుప్తపు తెరకెక్కించారు. కుమార్‌ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్‌ బొల్లినేని  నిర్మించారు. సిరీ లెల్ల కథానాయిక. సప్తగిరి, జిషు సేన్‌ గుప్తా, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర తొలి గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. ‘‘గల్లా ఎత్తి నిజం చెప్పే హీరోలకు సలాం కొట్టు.. కల్లాబొల్లి మాటలు జెప్పే కాకీ గోల ఎల్లాగొట్టు’’ అంటూ సాగిన ఈ పాటకు మహతి స్వర సాగర్‌ బాణీలు సమకూర్చారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యమందించారు. రామ్‌ మిరియాల ఆలపించగా.. భాను మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో నారా రోహిత్‌ నిజాయతీ గల న్యూస్‌ రిపోర్టర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని