Aa okkati adakku: పెళ్లి తేలికైన విషయం కాదు!
‘‘అసభ్యతకు తావులేని మంచి వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇది ఒక చక్కటి జీవిత అనుభవాన్ని పంచుకునేలా ఆలోచింపజేసేలా ఉంటుంద’’న్నారు అబ్బూరి రవి. ఆయన రచయితగా వ్యవహరించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు.
అబ్బూరి రవి
‘‘అసభ్యతకు తావులేని మంచి వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇది ఒక చక్కటి జీవిత అనుభవాన్ని పంచుకునేలా ఆలోచింపజేసేలా ఉంటుంద’’న్నారు అబ్బూరి రవి. ఆయన రచయితగా వ్యవహరించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు అబ్బూరి రవి.
- ‘‘పెళ్లి చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథతో రూపొందిన చిత్రమిది. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు పెళ్లి విషయంలో వయసు పరిమితి పూర్తిగా మారిపోయింది. వివాహాలు ఆలస్యమవడం వల్ల మానసికంగా కుంగుబాటుకు గురవుతున్న వాళ్లను తరచూ చూస్తూనే ఉన్నాం. నిజానికిది చాలా సీరియస్ అంశం. దాన్నే ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపిస్తూ.. ఎమోషనల్గా కనెక్ట్ చేసేలా చెప్పాం. ఇందులో ప్రత్యేకంగా సందేశం ఇవ్వడమన్నది ఏమీ చేయలేదు కానీ, అందర్నీ ఆలోచింపజేలా ఉంటుంది. ఈ కథలో వినోదమంతా సహజంగానే ఉంటుంది తప్ప ఎక్కడా బలవంతంగా ఇరికించినట్లు ఉండదు. ముఖ్యంగా సినిమాలో నరేశ్, జామి లివర్కు మధ్య వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే ఈ చిత్రంలోని నాయకానాయికల లవ్ ట్రాక్ కూడా చాలా ఫన్నీగా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితర పాత్రలన్నీ నవ్విస్తాయి. ఆ వినోదాన్ని థియేటర్లో ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు’’.
- ‘‘పెళ్లి చాలా పవిత్రమైనది. ఒకప్పుడు ఇంట్లో పెళ్లి చూపులు జరిగేవి. అప్పుడు ఇంట్లో సాంఘిక పరిస్థితులు తెలిసేవి. కుటుంబం గురించి అర్థమయ్యేది. కానీ, ఇప్పుడు పెళ్లి చూపులు చాలా వరకు హోటల్స్లో జరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాలు, రీల్స్ చూసి పెళ్లి చూపులు చూసుకునే సందర్భాలు రావడంతో ఆయా జంటల కుటుంబ పరిస్థితులు అసలు అర్థం కావడం లేదు. పెళ్లి అనేది అంత తేలిగ్గా ఉండకూడదు. ఒక బంధం బలంగా నిలబడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చాలా ఆసక్తికరమైన అంశాల్ని ఈ సినిమాలో చూపించాం. సినిమా ఫస్ట్కాపీ చూసుకున్నాక చాలా ఆనందంగా అనిపించింది. ఇంటర్వెల్ అద్భుతంగా కుదిరింది. క్లైమాక్స్ ఇంకా అద్భుతంగా వచ్చింది. అందుకే ఈ చిత్ర ఫలితంపై చాలా నమ్మకంగా ఉన్నాం’’.
- ‘‘ఏ దర్శకుడితోనైనా నేను పని చేసే విధానం ఒకేలాగే ఉంటుంది. కొత్త, పాత అని నాకు తేడాలుండవు. దర్శకుడు తీసుకొచ్చిన కథను గొప్పగా ఎలా చెప్పాలన్నదే ఆలోచిస్తాను. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 20ఏళ్లు పూర్తయ్యింది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణం చాలా బాగుంది. భవిష్యత్తులో తప్పకుండా దర్శకత్వం చేస్తాను. దానికి సంబంధించి నా ప్రయత్నాల్లో నేనున్నాను. రచయితగా యాక్షన్ థ్రిల్లర్స్ను బాగా ఇష్టపడతాను. మళ్లీ నటన వైపు వెళ్లే ఆసక్తిలేదు. ఒకవేళ మళ్లీ నటించాల్సి వస్తే ముందుగా అడివి శేష్ సినిమాలో చేయాలి (నవ్వుతూ). ప్రస్తుతం నేను ‘గూఢచారి 2’, ‘డెకాయిట్’ సినిమాలకు రచయితగా పని చేస్తున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భన్సాలీ నిర్మాణంలో మృణాల్ చిత్రం!
‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ విజయాలతో జోరు చూపించింది మృణాల్ ఠాకూర్. కానీ, ఇటీవల ఆమె నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీని తర్వాత ఆమె నుంచి మళ్లీ కొత్త కబురు వినిపించలేదు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘కుబేర’ సందడి
ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అగ్ర హీరో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆయన ఫస్ట్లుక్కు మంచి స్పందన లభించింది. -
కేన్స్లో కన్నప్ప
ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ బృందం సందడి చేసింది. కథానాయకుడు మంచు విష్ణు, నిర్మాత, నటుడు మంచు మోహన్బాబు, నృత్య దర్శకుడు ప్రభుదేవా తదితరులు చిత్రోత్సవాలకి హాజరయ్యారు. -
కొత్త ప్రాజెక్టుతో సారా అలీఖాన్..
ఈ మధ్యే ‘ఏ వతన్ మేరే వతన్’, ‘మర్డర్ ముబారక్’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ కథానాయిక సారా అలీఖాన్. మరో మూడు సినిమాలతో రోజుల్ని బిజీగా గడుపుతున్న ఈమె ఓ కొత్త ప్రాజెక్టుని పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది. -
యంగ్ గ్లోబల్ లీడర్.. భూమి
‘దమ్ లగాకే హైస్సా’, ‘భక్షక్’ లాంటి చిత్రాలతో ఉత్తమ నటిగా నిరూపించుకున్న భూమి పెడ్నేకర్ మరో కొత్త పాత్రలో మెప్పించడానికి సిద్ధమవుతోంది. అయితే ఈసారి తెరపై కాకుండా.. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) యంగ్ గ్లోబల్ లీడర్గా కనిపించనుంది. -
జూన్లో హరోం హర
ఈ నెల 31న విడుదల కావల్సిన ‘హరోం హర’ వాయిదా పడింది. జూన్ 14న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత మంగళవారం ప్రకటించారు. -
ఖురేషి అబ్రమ్ మళ్లీ వస్తున్నాడు
మోహన్లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా ‘లూసిఫర్’. 2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
కేన్స్ చిత్రోత్సవాల్లో గర్ల్స్ విల్ బీ గర్ల్స్
వైవిధ్యమైన కథలకు తెర రూపం ఇచ్చే ఉద్దేశంతో నట జంట రిచా చద్ధా, అలీ ఫజల్ ప్రారంభించిన బ్యానర్.. పుషింగ్ బటన్స్ స్టూడియోస్. ఈ పతాకంపై నిర్మించిన మొదటి చిత్రం ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’. దీంతో సుచీ తలాటీ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. -
పోలీసు హెచ్చరిక
ఏ రోజు నేను వాడిని కలుస్తానో... అదే ఆఖరి రోజు అవుతుందని హెచ్చరించింది ఓ పోలీసు అధికారిణి. ఇంతకీ ఆమె హెచ్చరిక ఎవరిని ఉద్దేశించో తెలియాలంటే ‘రక్షణ’ చూడాల్సిందే. పాయల్ రాజ్పూత్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రమిది. -
రెండింతల యాక్షన్తో టైగర్..?
ఎన్ని యాక్షన్ చిత్రాలు చేసినా..మళ్లీ కొత్తగానే అనిపిస్తుందంటూ చెప్పే బాలీవుడ్ కథానాయకుడు టైగర్ ష్రాఫ్.. మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ రూపొందిస్తున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో టైగర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. -
బికినీలో రకుల్ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం