బుర్రిపాలెం బుల్లోడు... అద్భుతాల అసాధ్యుడు
అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాల జుట్టుతో, ఊరించే కన్నులతో నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే
అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాల జుట్టుతో, ఊరించే కన్నులతో నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా, నమ్మి అంచలంచలుగా సూపర్స్టార్ స్థాయికి ఎదిగిన సుకుమారుడు, నటశేఖరుడు, పద్మవిభూషణుడు ఘట్టమనేని కృష్ణ. తెలుగు చలనచిత్ర రంగంలో నూతన ఒరవడి సృష్టించి, అధునాతన సాంకేతిక విలువలకు పట్టం కట్టి, సినిమాలు నిర్మించి నష్టపోయి, పడిలేచిన కెరటంలా విజృంభించి నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్రతో అభిమానులను అలరించిన కృష్ణ. సెల్యులాయిడ్ కర్షకుడు. ఈ మేరునగధీరుడు మే 31న పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని సాహస ప్రస్థానం గురించి కొన్ని విషయాలు...
సినిమాల్లో తొలి అడుగులు
ఈ బుర్రిపాలెం బుల్లోడు ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.యస్సీ చదువుతుండగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు పౌరసత్కారం జరిగింది. అక్కడ అక్కినేనికి అభిమానులు పట్టిన నీరాజనాలు, అందించిన గౌరవ సత్కారాలు చూసి, తను కూడా ఒక మంచి నటుడిగా ఎదిగితే ఎంత బాగుంటుంది అనే ఆలోచనలో పడ్డారు. నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందినవారు కావడంతో మద్రాసు వెళ్లి వారిని కలిసారు కృష్ణ. వయసు తక్కువగా ఉందనీ, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ, ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో ‘ఛైర్మన్’ వంటి అనేక నాటికల్లో, నాటకాల్లో పాల్గొని నటనపై అవగాహన పెంచుకున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత ఎల్.వి.ప్రసాద్ తనయుడు ఆనందబాబుని కలవమని అతని మామ ఇచ్చిన సలహాతో మద్రాసులో కృష్ణ అతనిని కలిసారు. ప్రసాద్ అప్పుడే ‘కొడుకులు - కోడళ్ళు’ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు. కృష్ణని ఆ సినిమాలో ఒక పాత్రకు ఎంపికజేసి, కొంత రిహార్సల్సు కూడా నిర్వహించారు. కారణాంతరాల వలన ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. మద్రాసులో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న శోభన్బాబుతో కలిసి కొన్ని నాటకాల్లో నటించారు కూడా. జగ్గయ్య నిర్మించిన ‘పదండి ముందుకు’ సినిమాలో కృష్ణ చిన్నపాత్ర పోషించారు. ఒకసారి కొడవటిగంటి కుటుంబరావుతో పాండీ బజార్లో వున్న కృష్ణను, కొత్తనటుల అన్వేషణలో వున్న దర్శకనిర్మాత శ్రీధర్ చూసి, ‘కాదలిక్కనేరమిల్లై’ (తెలుగులో ‘ప్రేమించిచూడు’)లో ఒక హీరోగా పరిచయం చేద్దామనుకుంటే, తమిళ భాష రాని కృష్ణకు ఆ అవకాశం చేజారి రవిచంద్రన్కి దక్కింది. తర్వాత కృష్ణ ‘కులగోత్రాలు’, ‘పరువు-ప్రతిష్ట’ సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. తెనాలి తిరగి వెళ్లాక, 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు కొత్త నటీనటులతో సినిమా తీస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఫొటోలు పంపిన కృష్ణకు మద్రాసు రమ్మని కబురొచ్చింది. స్క్రీన్ టెస్ట్ చేసి కృష్ణను హీరోగా ఎంపిక చేశారు. కృష్ణంరాజు, జయలలిత, హేమామాలిని కూడా తనతో పాటు ఇంటర్వ్యూకి వచ్చినా వారెవరూ ఎంపిక కాలేదు. కృష్ణ అదృష్టవంతుడని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. ఆదుర్తి వద్ద కో-డైరెక్టరుగా వున్న కె.విశ్వనాథ్ కృష్ణకి డైలాగులు పలకడంలో, నృత్య దర్శకులు హీరాలాల్ డ్యాన్సు చెయడంలో కఠిన శిక్షణ ఇచ్చారు. ఆదుర్తి తొలి సాంఘిక రంగుల చిత్రం ‘తేనెమనసులు’ కృష్ణని హీరో చేసి నిలబెట్టింది. ఈ సినిమాలో కృష్ణ సరసన సుకన్య, రామ్మోహన్ సరసన సంధ్యారాణి నటించగా, 31 మార్చి 1965న సినిమా విడుదలై వంద రోజులు ఆడింది. ఈ సినిమా తర్వాత కృష్ణకి ఆరు నెలలు గ్యాప్ వచ్చింది. తెనాలి వెళ్లిపోయారు. ఈ లోగా ఆదుర్తి కుదుర్చుకున్న అగ్రిమెంటు ప్రకారం కృష్ణతో ‘కన్నెమనసులు’ ప్రారంభమైంది. అదే టైమ్లో బాండ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో, రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ డూండేశ్వరరావు ‘గూఢచారి116’ సినిమా కోసం కృష్ణకు ఆఫర్ ఇస్తూ ఆదుర్తిని సంప్రదించారు. ఆదుర్తి దీవెనలతో ఆ యాక్షన్ చిత్ర అగ్రిమెంటుపై కృష్ణ సంతకం పెట్టి నటించారు. ‘కన్నెమనసులు’ జులై 22, 1966న విడుదలైతే, ‘గూఢచారి116’ ఆగస్టు 11, 1966న విడుదలై, తొలి స్పై పిక్చర్ కావడంతో దుమ్ము రేపింది. ‘కన్నెమనసులు’ యావరేజిగా ఆడింది. ఈ సినిమా తర్వాత కృష్ణ డూండీతో 25 సినిమాల దాకా చేశారు. ‘తేనెమనసులు’ చిత్రానికి కృష్ణ అందుకున్న తొలి పారితోషికం రెండు వేలు. ‘గూఢచారి116’ తర్వాత కృష్ణని అందరూ ‘ఆంధ్రా జేమ్స్బాండ్’ అని పిలవటం మొదలెట్టారు. ఈ చిత్ర విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాల్లో బుక్ అయ్యారు.
వటుడంతై.. అంతంతై...
‘తేనెమనసులు’ సినిమా ద్వారా డైలాగులు చెప్పడం, డ్యాన్సు చెయ్యడం, స్కూటరు, కారు నడపటం, హావభావాలు చక్కగా పలకటం నేర్చుకుంటే, ‘కన్నెమనసులు’ చిత్రం ద్వారా ఈత కొట్టటం, గుర్రపుస్వారీ చెయ్యడం, ఫోక్ డ్యాన్స్ చెయ్యడం నేర్చుకున్నారు కృష్ణ. ఇక ‘గూఢచారి116’లో స్పీడ్ యాక్షన్ మూవ్మెంట్లు, తుపాకీ వాడటం, ఫైటింగులు చెయ్యడం అలవడింది. ‘గూఢచారి 116’ విడుదలైన 100వ రోజు ఉదయాన విఠలాచార్య సినిమా కృష్ణ తలుపు తట్టింది. ‘ఇద్దరు మొనగాళ్ళు’ అనే జానపద సినిమా అది. కాంతారావుతోబాటు, ‘తేనెమనసులు’ సహనటులు సంధ్యారాణి, సుకన్యలతో కలిసి నటించిన ఈ చిత్రంలో చాలా భాగం కృష్ణకి మాటలే వుండవు. 1967లో ఈ సినిమాతో కలిసి ఏకంగా ఆరు సినిమాల్లో కృష్ణ నటించారు. వీటిలో చిత్రకారుడు బాపు తీసిన పూర్తి అవుట్డోర్ చిత్రం ‘సాక్షి’ కృష్ణ ఇమేజ్ని పెంచింది. మానవత్వం మీద నమ్మకంగల పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించి మెప్పించిన చిత్రమిది. విజయనిర్మలతో నటించిన మొదటి చిత్రం కూడా ఇదే. ‘మరపురాని కథ’ చిత్రంతో దర్శకుడు వి.రామచంద్రరావుతో కృష్ణకు మంచి స్నేహం ఏర్పడింది. ఆల్ టైం గ్రేట్ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ దాకా రామచంద్రరావు, కృష్ణతో మొత్తం 13 చిత్రాలకు పనిచేశారు. వీటిలో ‘అసాధ్యుడు’, ‘నేనంటే నేనే’, ‘కర్పూర హారతి’, ‘అఖండుడు’, ‘మా మంచి అక్కయ్య’, ‘పెళ్లికూతురు’, ‘గంగ-మంగ’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలున్నాయి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో మూడు చిత్రాలు విజయనిర్మలతో నటించినవి. ఇవన్నీ చెయ్యడానికి కృష్ణ ఎన్నో దెబ్బలుతిన్నారు. ‘తేనెమనసులు’ టైంలో స్కూటర్మీంచి నాలుగైదుసార్లు పడి గాయపడ్డారు. ‘కన్నెమనసులు’లో గుర్రం మీంచి పడి ఒళ్లు హూనం చేసుకున్నారు. ‘ఇద్దరు మొనగాళ్లు’ ఫైట్స్ సీక్వెన్సుల్లో కత్తిగాట్లకు రక్తం ఓడి జ్వరమొచ్చింది. ‘గూఢచారి 116’ షూటింగులో మామూలు దెబ్బల మాటెలావున్నా, పహిల్వాన్ నెల్లూరు కాంతారావుని పైకెత్తబోయి పడి, ఎడమ మోకాలు దెబ్బతింది. ఇన్ని దెబ్బలు కాచుకొని ముందుకురికాడు కాబట్టే కృష్ణ సూపర్స్టార్ అయ్యారు. సినిమాల్లో నటించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయములో మొదటి నాలుగైదు చిత్రాలు కృష్ణకు పాఠాలు నేర్పాయి. విజయనిర్మలతో నాలుగైదు సినిమాలు చెయ్యగానే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. పరస్పర అంగీకారంతో 1969లో ఇద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. సాహసానికి మారుపేరు కృష్ణ. తొలి 30 సంవత్సరాల్లో కృష్ణ ఏకబిగిన 296 సినిమాల్లో నటించడం ఒక అరుదైన రికార్డు. 2011లో నటనారంగం నుంచి వైదొలిగేదాకా కృష్ణ నటించిన సినిమాలు 344. ఇంత వరకు ఏ హీరో ఈ రికార్డుని బ్రేక్ చెయ్యకపోవడమే ఒక రికార్డు.
సొంత నిర్మాణ సంస్థ ఆవిర్భావం
1970లో పద్మాలయ సంస్థ నెలకొల్పి మొదటి ప్రయత్నంగా ‘అగ్నిపరీక్ష’ చిత్రాన్ని నిర్మించారు. సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులు చిత్ర నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటుంటే కృష్ణ సొంత సినిమాలు నిర్మిస్తూ ఇతర సంస్థల చిత్రాల్లో నటించేవారు. 1971లో కృష్ణ రెండో సొంత చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో నిర్మించారు. తెలుగులో ఇది తొలి సినిమాస్కోప్ చిత్రంగా రికార్డు సాధించింది. ఈ సినిమా సింహభాగాన్ని రాజస్థాన్ అడవుల్లో, హిమాచల్ప్రదేశ్లో తీసారు. ఈ చిత్రంలో కృష్ణని అభిమానులు కౌబాయ్గా చూసుకున్నారు. ఈ సినిమా ఖ్యాతి దేశవిదేశాలకు విస్తరించింది. ‘ది ట్రెజర్ ఐలాండ్’ పేరుతో ఇంగ్లిషులోకి అనువదించిన ఈ సినిమాని 125 దేశాల్లో ప్రదర్శించారు. నటుడు ప్రభాకర్రెడ్డిని భాగస్తుడిగా చేసుకొని 60 వేల అడుగుల నిడివిగల ‘పండంటి కాపురం’ సినిమాని కేవలం 45 రోజుల్లో నిర్మించి, క్లైమాక్స్ దృశ్యాల్ని బందరులో అశేష జనవాహిని మధ్య చిత్రీకరించి కృష్ణ రికార్డు సృష్టించారు. ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించడమే కాదు. అందులో నటించిన జమునకు ‘రాణీ మాలినీ దేవి’గా గుర్తింపుతెచ్చి పెట్టింది. కృష్ణ 100వ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘అసాధ్యుడు’ చిత్రంలో సీతారామరాజుగా కనిపించిన కృష్ణకు, ఆ కథను చిత్రంగా తీయాలనే అభిలాష కలిగింది. స్వాతంత్య్ర సమరాన్ని రక్తాక్షరాలతో లిఖించిన సంగ్రామ సింహంగా, విప్లవాగ్నులు మండించిన వీరాభిమన్యునిగా, స్వేచ్ఛా సమరశంఖమై, బ్రిటీషు సింహాసనపు పునాదుల్లే గజగజలాడించిన విప్లవ ప్రవక్తగా సీతారామరాజుని ఈ సినిమాస్కోప్ చిత్రంలో తీర్చిదిద్దారు కృష్ణ. భారీ బడ్జెట్ సినిమాలను 13 లక్షల్లో తీయ్యగలిగే ఆ రోజుల్లోనే, కృష్ణ ఈ సినిమాకు 25 లక్షలు ఖర్చు చేశాడు. సినిమా విజయవంతమై మంచి లాభాలను ఆర్చించింది. 1982లో వచ్చిన కృష్ణ 200వ చిత్రం ‘ఈనాడు’ కూడా ఒక్క యుగళగీతం లేకున్నా బాగా ఆడింది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో నిర్మించిన ‘తెలుగువీర లేవరా’ కృష్ణకు 300వ చిత్రం.
ఎన్నో విశేషణాంశాలు
తన సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన ఈ అసాధ్యుడు డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పిలిపించుకున్నారు. 1969-72 మధ్య నాలుగేళ్లలోనే 60 చిత్రాల్లో నటించిన ఘనత పొందారు. రోజూ మూడు షిఫ్టుల్లో ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటలదాకా ఏకబిగిన నటించి నిద్రలేని రాత్రులు గడిపిన సంఘటనలు కృష్ణ చలనచిత్ర ప్రస్థానంలో ఎన్నో! కృష్ణ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘సింహాసనం’ సినిమా తెలుగులో తొలి 70 ఎం.ఎం. చిత్రంగా చరిత్ర పుటలకెక్కింది. బప్పిలహరిని తెలుగులో సంగీత దర్శకునిగా పరిచయం చేసిన ఘనత కృష్ణదే! తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్ల్లో ‘సాక్షి’ సినిమాలో కృష్ణ నటజీవితంలో మొత్తం 80 మంది హీరోయిన్ల సరసన నటించారు. అందులో 47 సినిమాల్లో విజయనిర్మలే హీరోయిన్. జయప్రద 42 చిత్రాల్లో, శ్రీదేవి 31 చిత్రాల్లో నటించి, అందమైన జోడీలుగా గుర్తింపు పొందారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో శ్రీశ్రీ రాసిన ‘‘తెలుగు వీర లేవరా’’ పాటకు జాతీయస్థాయిల్లో ఉత్తమ గేయరచయిత బహుమతిని సాధించారు. ఒక తెలుగు చిత్రానికి జాతీయస్థాయి బహుమతి రావడం ఇదే ప్రథమం. ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘పాడిపంటలు’, ‘రామరాజ్యంలో రక్తపాశం’ వంటి కుటుంబ కథా చిత్రాలను నిర్మించి సాహసాన్ని నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ ‘దానవీర శూర కర్ణ’ సినిమాకి పోటీగా ‘కురుక్షేత్రం’ చిత్రం నిర్మించి సంక్రాంతి కానుకగా ఒకేరోజు విడుదల చేసి ధీరుడనిపించుకున్నారు. 1980లో హిందీ చిత్రరంగ ప్రవేశం చేసి జితేంద్రను హీరోగా పెట్టి ‘సింఘాసన్’ నిర్మించారు. ‘సంపంగి’ తెలుగు సినిమాని ‘ఇష్క్ హై తుమ్సే’గా రీమేక్ చేశారు. మొత్తం 17 సినిమాలకు దర్శకత్వం వహించారు. 2009లో భారత ప్రభుత్వం కృష్ణను ‘పద్మభూషణ్’ బిరుదుతో సత్కరించింది. కృష్ణకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మహేశ్బాబు సంచనల హీరోగా అలరారుతున్నారు. మంచితనం, నిజాయితీ, నిబద్దత కృష్ణకున్న సుగుణాలు. సగటు ప్రేక్షకుడి వినోద సాధనమైన సినిమా కన్నులపండువగా వుండాలని ఆశించి, తెలుగు సినిమాకు భారీతనాన్ని చేకూర్చి, కళ్లముందు స్వప్నజగత్తును ఆవిష్కరించిన ఘనత కృష్ణదే! తెలుగు చిత్రసీమ కృష్ణకు ఎప్పుడూ రుణపడి వుంటుంది. బుర్రిపాలెం బుల్లోడికి చిరాయురస్తు...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Puneeth Rajkumar: పునీత్ బయోపిక్ తీసే ప్రయత్నం చేస్తా!
కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నటుడిగా మెప్పించడమే కాదు.. నిజజీవితంలో తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారాయన. -
Puneeth Rajkumar: పునీత్ కళ్లతో నలుగురికి కంటిచూపు
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హీరోగానే కాదు.. సేవల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. బతికున్నంత కాలం ఎంతో మంది ఆదుకుని ‘పునీత’డనిపించుకున్న ఆయన.. చనిపోతూ కూడా నలుగురి జీవితాల్లో వెలుగునింపారు. -
Sonusood: ఇకపై ఉచితంగా ఈఎన్టీ సర్జరీలు
చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన ఈఎన్టీ సర్జరీలను ఉచితంగా ‘సోనూ ఛారిటీ ఫౌండేషన్’ ద్వారా అందిస్తున్నట్లు మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. -
ఆమంచి... మా మంచి హాస్య నటుడు
ఆయనని తలచుకోగానే మనకు తెలీకుండా పెదాలపై చిరునవ్వులు చిందుతాయి. ఎన్ని బాధల్లో ఉన్నా చిటికలో మనసు ఉల్లాసభరితమవుతుంది. ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆయన మంచి హాస్యానికి అసలు సిసలైన చిరునామా. అందుకే... అంటారు ప్రేక్షకులంతా -
అసంపూర్ణ చిత్రం...ఉదయ్ కిరణ్
ఉదయించి మధ్యాహ్నానికి చేరకుండానే... మబ్బులు కమ్మి చిక్కటి చీకట్లు అలముకున్నట్టు అర్ధాంతరంగా అంతర్ధానమైన ఓ కిరణం గురించి తలచుకుంటేనే గుండెలు బరువెక్కుతాయి. కన్నీళ్లు కనురెప్పల్ని తడిమేస్తాయి. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న ఓ యువకుడు... -
ఒకే మార్గం...ఒకే లక్ష్యం...పరచూరి బ్రదర్స్
ఔను... వారిద్దరి దేహాలు వేరయినా ఆత్మ ఒకటే. చేపట్టిన వృత్తి ఒకటే. చేరుకోవాలన్న లక్ష్యం ఒక్కటే. తెలుగు చిత్ర సీమలో 350కి పైగా చిత్రాలకు కధలు, మాటలు అందించిన రచయితల ద్వయం పేరు... పరచూరి బ్రదర్స్. ఒంటి పేర్లతో కాకుండా కేవలం ఇంటి పేరుతోనే -
తలకట్టు కనికట్టు... కోడి రామకృష్ణ
ఎప్పుడూ తెల్లని దుస్తులు... దర్శకత్వం చేస్తున్నప్పుడు మాత్రం తలకో కట్టు. ఆ కట్టుతోనే కనికట్టు చేసి తన సినిమాల్ని విజయవంతం చేసుకున్నారాయన. హెడ్ బాండ్ లేని కోడి రామకృష్ణను ఊహించలేం. షూటింగ్ స్పాట్కి వచ్చిన ఆయన నుదుటి చుట్టూ ఓ కట్టు కడితే -
సాహిత్య మారుతి... గొల్లపూడి
ఆయన ఒక కథా రచయిత, ఒక నవలా రచయిత, ఒక రంగస్థల నాటక రచయిత, ఒక వక్త, ఒక పాత్రికేయుడు, ఒక సినిమా రచయిత, ఒక సినిమా నటుడు, ఒక బుల్లితెర ప్రయోక్త. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు. ఈ-టీవీ వారు నిర్వహించిన ‘ప్రతిధ్వని’ -
చిత్రసీమకు ‘గురువుగారు’!
సినిమాకి ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్..’ దర్శకుడే అని అందరూ చెబుతారు. కానీ అదే నిజం అని చేతల్లో చూపించిన దర్శక శిఖరం... దాసరి నారాయణరావు. వెండితెరపై కథానాయకులుగా మెరుస్తూ ఓ ఇమేజ్ని ఏర్పాటు చేసుకొంటేనే స్టార్ అవుతారు కదా? తెర వెనక ఉంటూ -
భాగ్యనగర సినీ భగీరథుడు... అక్కినేని
1945లో పూర్తిస్థాయి నటుడిగా ‘మాయాలోకం’లో విహరించిన అక్కినేని, పల్లెటూరి నేపధ్యంలో నటించిన మొదటి చిత్రం దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు నిర్మించిన ‘పల్లెటూరిపిల్ల’గా చెప్పవచ్చు. అక్కినేనికి ఇది 12వ చిత్రం కాగా, ఎన్.టి.ఆర్తో కలిసి నటించిన మొదటి మల్టీ -
వెండితెరపై... సీమ పెతాపం
రాయలసీమ... తెలంగాణ... నెల్లూరు...యాస ఏదైనా సరే... ఆయన నోటి నుంచి వచ్చిందంటే ‘లెస్స పలికారు’ అంటూ చప్పట్లు కొట్టాల్సిందే! ప్రతినాయకుడిగానైనా... హాస్య పాత్రలైనా... ఆయన చేశారంటే... వాటిలో హావభావాలు పోత పోసినట్టే! విలక్షణ నటనకి నిలువెత్తు రూపంలా కనిపించే ఆయనే... జయప్రకాష్రెడ్డి. తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ జేపీగా పిలుచుకునే ఆయన స్థానం ఎప్పటికీ ప్రత్యేకమైనది.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల