New Movies Release dates: వస్తున్నాం.. వచ్చేస్తున్నాం.. థియేటర్లో కలుద్దాం!
చిత్రసీమకు మరింత కళ వస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల తేదీని ప్రకటించాయి.బుధవారం మరికొన్ని (తెలుగు, హిందీ, తమిళ్ చిత్రాలు) థియేటర్లో విడుదల తేదీలను ఖరారు చేశాయి. అవేంటంటే..
తాజాగా విడుదల తేదీలను ప్రకటించిన చిత్రాలివే!
ఇంటర్నెట్ డెస్క్: కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండడంతో చిత్రసీమకు మరింత కళ వస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల తేదీని ప్రకటిస్తూవస్తున్నాయి. బుధవారం మరికొన్ని (తెలుగు, హిందీ, తమిళ్ చిత్రాలు) థియేటర్లో విడుదల తేదీలను ఖరారు చేశాయి.
వలిమై: ఫిబ్రవరి 24
అజిత్ హీరోగా హెచ్.వినోద్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వలిమై’. బోనీ కపూర్ నిర్మించారు. హ్యూమా ఖురేషి కథానాయిక. తెలుగు యువనటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. కొవిడ్ పరిస్థితుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో అజిత్ సీబీసీఐడీ అధికారిగా కనిపించనున్నారు. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ రానుంది.
అమితాబ్ ‘ఝండ్’: మార్చి4
బాలీవుడ్లోనూ థియేటర్లరో సందడి చేసేందుకు కొత్త సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడ్డ చిత్రాలు ఒక్కొక్కటీ విడుదల తేదీని ప్రకటిస్తూ వస్తున్నాయి. బిగ్బి అమితాబ్ సైతం ‘‘ ‘ఝండ్’తో వస్తున్నా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ‘‘ మా బృందంతో ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉండండి. మార్చి 4, 2022లో ‘ఝండ్’ థియేటర్లలో విడుదల కానుంది’’ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఎన్జీవో స్లమ్ సాకర్ ఫౌండర్ విజయ్ బర్సే జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు నాగరాజ్ మంజులే. పిల్లల్లో స్ఫూర్తి నింపి ఓ ఫుట్బాల్ టీమ్ని ఏర్పాటుచేసేందుకు విజయ్ బర్సే ఏమి చేశారన్న కథ సారాంశం. ఆకాశ్ తోశర్, రింకూ రాజ్ గురు కీలక పాత్రలు పోషించారు. టీ-సిరీస్, తాండవ ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆపాట్ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
పక్కా కమర్షియల్: మే 20
గోపీచంద్, రాశిఖన్నా జంటగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. తొలుత 2022 మార్చి 18న థియేటర్లో విడుదల అని చెప్పినా కరోనా కారణంగా వాయిదా వేశారు. ‘‘కరోనా కరుణిస్తే.. మే 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల కలుద్దాం’’ అంటూచిత్ర బృందం విడుదల తేదీని తాజాగా ఖరారు చేసింది. ఇందులో లాయర్లుగా గోపిచంద్, రాశీ ఖన్నా కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. జాక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దేవర’ ఎన్టీఆర్కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు.