jagapathi babu: ఆనందయ్య మందు తీసుకున్నా!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన కరోనా ఔషధాన్ని తాను ఎప్పుడో తీసుకున్నానని సినీ నటుడు జగపతిబాబు అన్నారు.

Updated : 07 Jun 2021 15:50 IST

హైదరాబాద్‌: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన కరోనా ఔషధాన్ని తాను ఎప్పుడో తీసుకున్నానని సినీ నటుడు జగపతిబాబు అన్నారు. ఇటీవల జగపతిబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆనందయ్య తయారు చేసిన ఔషధం పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

‘‘ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు వాడిన వాళ్లలో నేనూ ఒకడిని. ఇప్పుడు ఈ విషయం చెబుతున్నా. ఆయుర్వేద తప్పు చేయదని నా నమ్మకం. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తెలుసుకున్న తర్వాత అంతా మంచే జరుగుతుందని డోస్‌ తీసుకున్నా. ఇప్పటివరకూ నాకెలాంటి కరోనా రాలేదు’’ అని జగపతిబాబు అన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మరోవైపు ఆనందయ్య మందు కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఔషధం ఇస్తామని, స్థానికేతరులు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని