Saindhav: చివరి దశకు ‘సైంధవ్‌’ మిషన్‌

వెంకటేశ్‌ కథానాయకుడిగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్‌’. కథానాయికలు శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియాతోపాటు బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated : 29 Jun 2023 13:44 IST

వెంకటేశ్‌ (Venkatesh) కథానాయకుడిగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). కథానాయికలు శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియాతోపాటు బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. బుధవారంతో ఓ కీలక షెడ్యూల్‌ చిత్రీకరణని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా  ‘మా సైంధవ్‌ చివరి మిషన్‌ దిశగా దూసుకెళుతోంది’ అంటూ చిత్రబృందం ఓ వీడియోని విడుదల చేసింది. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘సైంధవ్‌’ని డిసెంబరు 22న దక్షిణాది భాషలతో పాటు హిందీలో విడుదల చేయనున్నారు. వెంకటేష్‌ 75వ చిత్రమైన ‘సైంధవ్‌’కి సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.మణికందన్‌, కూర్పు: గ్యారీ బీహెచ్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని