Tollywood: ‘అల్లూరి’ విచ్చేస్తున్నాడు
శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అల్లూరి’. నిజాయతీకి మారు పేరు.. అనేది ఉపశీర్షిక. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.
శ్రీవిష్ణు (SreeVishnu) హీరోగా ప్రదీప్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అల్లూరి’ (Alluri). నిజాయతీకి మారు పేరు.. అనేది ఉపశీర్షిక. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. కయ్యదు లోహర్ కథానాయిక. తనికెళ్ల భరణి, మధుసూధన్రావు, ప్రమోదిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన ఓ కొత్త లుక్ను నెట్టింట పంచుకున్నారు. ఆ పోస్టర్లో శ్రీవిష్ణు చేతిలో బల్లెం పట్టుకుని సీరియస్ లుక్లో కనిపించారు. ‘‘ఇదొక చక్కటి యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో శ్రీవిష్ణు నిజాయతీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు’’ అని చిత్ర బృందం తెలిపింది. సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఛాయాగ్రహణం: రాజ్ తోట.
సందేశమిచ్చే ‘మెకానిక్’
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’ (mechanic). ట్రబుల్ షూటర్.. అన్నది ఉపశీర్షిక. ముని సహేకర దర్శకుడు. ఎమ్.నాగమున్నెయ్య, కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదానికి పెద్ద పీట వేస్తూ.. సందేశాత్మకంగా రూపొందిస్తున్నాం. ఇందులో అన్ని రకాల వాణిజ్య హంగులు పుష్కలంగా ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: వినోద్ యాజమాన్య, ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరాం.
భళా చోర.. భళా
ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భళా చోర భళా’ (Bhala Chora Bhala). ఎ.ప్రదీప్ తెరకెక్కించారు. ఎ.జనని ప్రదీప్ నిర్మించారు. శాంతి దేవగుడి, చింటూ, రామ్ జగన్, చిత్రం శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు ఖయ్యూమ్ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్ టైమ్లో ప్రదీప్ నాకు కథ చెప్పారు. వినగానే బాగా నచ్చి.. చేస్తానన్నా. 9రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి.. రెండు నెలల్లో నిర్మాణాంతర పనులు ముగించి విడుదలకు సిద్ధం చేశాం. మంచి చిత్రమిది. దీన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో నేనూ ఓ పాత్ర చేశా. అందరికీ మా ప్రయత్నం నచ్చుతుందని భావిస్తున్నా’’ అన్నారు చిత్ర దర్శకుడు. ఈ సినిమాకి సంగీతం: సింహ కొప్పర్తి, వెంకటేష్ అద్దంకి, ఛాయాగ్రహణం: లక్ష్మణ్.
ప్రేమకథ
సతీష్ మేరుగు కథానాయకుడిగా నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఏయ్ బుజ్జి నీకు నేనే’ (Ye Bujji Niku Nene). హృతికాసింగ్ కథానాయిక. విడుదలకి సిద్ధమైన ఈ సినిమా గీతావిష్కరణ వేడుక ఇటీవల హైదరాబాద్లో జరిగింది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై పాటల సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘చిన్న సినిమాలకి మద్దతిస్తే పరిశ్రమ బాగుంటుంది. మరిన్ని మంచి సినిమాలు రూపొందే అవకాశం ఉంటుంది. ప్రచార చిత్రాల్ని చూస్తుంటే మంచి కథతో రూపొందినట్టు స్పష్టమవుతోంది’’ అన్నారు. సతీష్ మేరుగు మాట్లాడుతూ ‘‘మంచి ప్రేమకథతోపాటు... వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, రామిరెడ్డి, ప్రేమ్కుమార్, కుప్పిలి శ్రీనివాస్, దేవా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.