MAA election: ముగిసిన ‘మా’ సమావేశం: ఎన్నికలు ఎప్పుడంటే?
వాడీ-వేడీ ఆరోపణలు, చర్చలతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలపై సర్వత్ర ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. వెంటనే
హైదరాబాద్: వాడీ-వేడీ ఆరోపణలు, చర్చలతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలపై సర్వత్ర ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తుండగా, కరోనా పరిస్థితుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం. ‘మా’ సర్వసభ్య సమావేశం వర్చువల్గా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల తేదీలపై ‘మా’ సభ్యులు భిన్నాభిప్రాయాలు తెలిపారు. కొందరు సెప్టెంబరు, మరికొందరు అక్టోబరులో నిర్వహించాలని అన్నారు. వారం రోజుల్లో ఎన్నికల తేదీని ప్రకటిస్తామని సీనియర్ నటులు కృష్ణంరాజు, మురళీమోహన్లు తెలిపారు. డీఆర్సీ కమిటీ ఎలా చెబితే అలా చేస్తానని ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ తెలిపారు.
‘‘జనరల్ బాడీ ఇలా సమావేశం అవడం సంతోషం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే పద్ధతి కొనసాగిస్తే మంచిది. వారం రోజుల్లో ఎన్నికల తేదీని ప్రకటిస్తాం. 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రస్తుతం సాధ్యం కాదు. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని, భౌతిక దూరం పాటిస్తూ వాటిని నిర్వహించాలి. సెప్టెంబరు రెండో వారం నుంచి అక్టోబరు రెండో వారం మధ్యలో ఏ తేదీ అనువుగా ఉంటుందో చూసి, అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తాం. అప్పటి వరకూ అందరూ సంయమనంతో ఉండండి’’
- సీనియర్ నటుడు మురళీ మోహన్
‘‘ఎన్నికలు జరగాలి. ఇప్పటివరకూ పనిచేసిన వారందరూ చక్కగా చేశారు. నిబంధనల ప్రకారం 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలంటే సెప్టెంబరు 12వ తేదీ అవుతుంది. దీనిపై ఇక చర్చలు వద్దు. అవసరమైతే మరో వారం సమయం తీసుకోండి. అంతకుమించి పొడిగించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలి’’
- అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్రాజ్
‘‘ఏం మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఎవరికి వారే యమునా తీరే. యథారాజా తథా ప్రజా. అందరూ మేధావులు. ఒకరిని అనే స్థితిలో మనం లేము. ఒక బిల్డింగ్ కొని, దాన్ని అతి తక్కువ ధరకు అమ్మడం ఎంత వరకూ సమంజసం అన్నది ఒక్కరైనా ఆలోచించారా? ఒక భవనం అమ్మేసి, మళ్లీ ఇప్పుడు కావాలనడం ఎవరైనా దీని గురించి మాట్లాడారా? ఎవరైనా సమాధానం చెబుతారా? ఇది నా మనసును కలిచి వేస్తోంది. రూపాయి కొని, అర్ధ రూపాయి అమ్మేస్తారా?నటనలో గొప్పవారైనందరూ నా ఫ్యామిలీ గొప్పంటే.. నా కుటుంబం గొప్ప అని కబుర్లు చెప్పుకొంటున్నారు. అందరూ ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరం బతుకుతున్నాం. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి’’
- సీనియర్ నటుడు మోహన్బాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెట్లోకి అప్పుడే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తదుపరి సినిమా మహేశ్బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. -
లెక్కలు సరిచేసే రక్షకుడు
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పట్టాలెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది. -
‘కుబేర’లో నాగ్ ఇలా!
నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్రావు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలో నాగార్జునకు సంబంధించిన ఫస్ట్లుక్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. -
మండు వేసవిలో హాయిగా నవ్వించే చిత్రం
‘‘పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాల్ని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు అల్లరి నరేశ్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. -
‘హౌస్ఫుల్ 5’.. ‘జాలీ ఎల్ఎల్బీ 3’
‘బడేమియా ఛోటేమియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హౌస్ఫుల్ 5’. -
ప్రభుదేవా షూటింగ్ షురూ
‘ముక్కాల ముక్కాబులా..’ ఇప్పటికీ సినీప్రేమికుల్ని అలరిస్తున్న గీతమిది. ఇందులో ప్రభుదేవా డ్యాన్స్, ఏఆర్. రెహమాన్ సంగీతం అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘ఏఆర్ఆర్పీడీ6(వర్కింగ్ టైటిల్)’ అనే సినిమా రూపొందుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. -
రిపబ్లిక్ డేకి ‘లాహోర్ 1947’?
ప్రత్యేకమైన రోజున వారి చిత్రాల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఇప్పుడదే పనిలో బిజీగా ఉంది ‘లాహోర్: 1947’ చిత్రబృందం. -
ఈటీవీ విన్లో ప్రణయ విలాసం
‘ప్రేమలు’ సినిమాలో తన నటనతో సినీప్రియులను మెప్పించింది మలయాళ కథానాయిక మమితా బైజు. ఆమె, అర్జున్ అశోకన్ జంటగా నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. నిఖిల్ మురళి తెరకెక్కించారు. -
చాలా సన్నివేశాలు షాక్కు గురి చేస్తాయి
‘‘ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టే వినూత్నమైన కథతో రూపొందిన థ్రిల్లర్ చిత్రం ‘ప్రసన్న వదనం’. దీంట్లో చాలా సన్నివేశాలు షాక్కు గురి చేసేలా ఉంటాయి’’ అన్నారు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అర్జున్ వై.కె తెరకెక్కించారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్