Nayanthara: ‘అన్నపూరణి’పై ఆగ్రహం

అగ్రకథానాయిక నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూరణి’. నీలేశ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Updated : 12 Jan 2024 09:47 IST

అగ్రకథానాయిక నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూరణి’. నీలేశ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పట్ల నయనతారతో పాటు చిత్రబృందంపై పలువురు రాజకీయ నాయకులు గురువారం కేసు నమోదు చేశారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ ఐటీ సెల్‌ వ్యవస్థాపకుడు రమేశ్‌ సోలంకి ముంబయిలోని తిలక్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌ని ఆశ్రయించారంటూ అధికారులు తెలిపారు. ఈ నేఫథ్యంలో ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న ఈ సినిమాని చిత్రబృందం తొలిగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని