Rashmika mandanna: మృత్యువు నుంచి బయటపడ్డాం..: రష్మిక

ప్రముఖ కథానాయిక రష్మిక మందనకు ఓ విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. చావు నుంచి తప్పించుకున్నామంటూ తన భయానక అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది.

Updated : 18 Feb 2024 12:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌, బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ప్రముఖ నటి రష్మిక మందన (Rashmika)కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. రష్మిక ఇటీవల ముంబయి నుంచి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణించింది.

టేకాఫ్‌ అయిన 30 నిమిషాలకే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ముంబయిలో అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో రష్మిక ఎంతో కంగారు పడింది. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ సమయంలో మరో హీరోయిన్‌ శ్రద్ధా దాస్‌ కూడా ఉన్నారు.ఈ భయానక అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది . ‘‘ఈ రోజు మేము మృత్యువు నుంచి తప్పించుకున్నాం’’ అంటూ శ్రద్ధతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. ఈ పోస్టు వైరల్‌గా మారింది.

సాయిధరమ్‌ తేజ్‌ సినిమా యూనిట్‌కు టీఎస్‌ న్యాబ్‌ పోలీసుల నోటీసులు

యానిమల్‌ మూవీతో భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్న రష్మిక ఇటీవల ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ‘ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30’ జాబితాలో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘పుష్ప: ది రూల్‌’లో నటిస్తోంది. రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘చావా’ తదితర చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని